పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి తన ప్రసంగంలో అనేక విషయాలను వెల్లడించారు. ఎల్ పీజీ గ్యాస్ సబ్సిడీని 1.2 కోట్ల మంది వినియోగదారులు వదులుకున్నారని చెప్పారు. దేశంలో 26కోట్ల కంటే ఎక్కుమందికి జన్ ధన్ ఖాతాలు ఉన్నాయని చెప్పారు. వారిలో 20 కోట్ల మందికి రూపే కార్డులు ఇచ్చామని, ఇది ప్రజలను డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ వైపు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతుల గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. 3.66 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం అందించినట్టు తెలిపారు. 3 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మార్చినట్టు చెప్పారు. అలాగే 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 20 లక్షల టన్నులు పప్పు ధాన్యాలు సేకరించినట్టు తెలిపారు.
ఉద్యోగినుల కోసం ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 24 వారాలకు పెంచినట్టు చెప్పారు. కొత్త ఉద్యోగాల సృష్టికి ఆరువేల కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిపారు. మహాత్మాగాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం కింద 47 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడానికి వెచ్చించినట్టు చెప్పారు. అంతరిక్షంలోకి ఒకేసారి 20 ఉపగ్రహాలు పంపించి విజయవంతంగా ప్రయోగాలు చేసినట్టు చెప్పారు. ఎల్వోసీ దాటి వెళ్లి విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రస్థావరాలను మన సైన్యం నాశనం చేసి వచ్చిందని చెప్పారు.
ఉద్యోగినుల కోసం ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 24 వారాలకు పెంచినట్టు చెప్పారు. కొత్త ఉద్యోగాల సృష్టికి ఆరువేల కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిపారు. మహాత్మాగాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం కింద 47 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడానికి వెచ్చించినట్టు చెప్పారు. అంతరిక్షంలోకి ఒకేసారి 20 ఉపగ్రహాలు పంపించి విజయవంతంగా ప్రయోగాలు చేసినట్టు చెప్పారు. ఎల్వోసీ దాటి వెళ్లి విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రస్థావరాలను మన సైన్యం నాశనం చేసి వచ్చిందని చెప్పారు.