యాప్నగరం

బడ్జెట్ ఎఫెక్ట్.. వీటి ధరలు పెరుగుతాయ్!

టీవీలు, స్మార్ట్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీని 15 నుంచి ఇరవై శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

TNN 1 Feb 2018, 3:03 pm
టీవీలు, స్మార్ట్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీని 15 నుంచి ఇరవై శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. యూనియన్ బడ్జెట్ 2018లో ఈ విషయాన్ని ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. ఫలితంగా టీవీల, స్మార్ట్ ఫోన్ల ధరల్లో పెంపుదల చోటుచేసుకోనుంది. పెంపుదల ఐదు శాతం కావడంతో వీటి ధర చెప్పుకోదగిన స్థాయిలోనే పెరుగుతుంది.
Samayam Telugu prices of imported mobile phones to rise on custom duty hike to 20
బడ్జెట్ ఎఫెక్ట్.. వీటి ధరలు పెరుగుతాయ్!


ప్రధానంగా ఇంపోర్టెట్ మొబైల్స్, టీవీ పార్ట్స్ మీద ఈ ప్రభావం పడనుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలకు రెక్కలు వచ్చినట్టే. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీవీలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అలాగే టీవీ పార్ట్స్ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ ఫిట్ చేసే టీవీ పార్ట్స్ మీద కూడా కస్టమ్ డ్యూటీని ఐదు శాతం పెంచారు.

ఫలితంగా..టీవీల, స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతాయని స్పష్టం అవుతోంది. దేశీయంగా ‘మేక్ ఇన్ ఇండియా’ ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పెంపుదల చేసినట్టుగా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం వివిధ విదేశీ కంపెనీలు కూడా ఇండియాలోనే తమ ఫోన్లను, టీవీలను తయారు చేస్తున్నాయని.. కొన్ని కంపెనీలు మాత్రం దిగుమతి మాత్రమే చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రధానంగా ఐఫోన్లు దిగుమతి అవుతున్నాయి. అలాగే ఇతర ఇంపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ల ధర కూడా పెరగనుంది.

అయితే ఇలా పెరగడం తొలి సారి కాదు. ఏడాది కిందట తొలి సారి ఇంపోర్టెడ్ ఫోన్లపై పది శాతం కస్టమ్ డ్యూటీ విధించారు. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్లో ఐదు శాతం పెంచారు, ఇప్పుడు మరో ఐదో శాతం పెంపుదల చోటు చేసుకోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.