యాప్నగరం

జైట్లీ బడ్జెట్: స్టాక్ మార్కెట్ నిరాశ

అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. స్టాక్ మార్కెట్ సూచీలు తిరోగమనం బాట పట్టాయి.

TNN 1 Feb 2018, 5:26 pm
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. స్టాక్ మార్కెట్ సూచీలు తిరోగమనం బాట పట్టాయి. ఈ ఉదయం వంద పాయింట్ల పై లాభంతో ట్రేడ్ అయిన సెన్సెక్స్.. బడ్జెట్ ప్రసంగం అనంతరం మాత్రం తిరోగమించింది. ఒక దశలో ఏకంగా 463 పాయింట్లు నష్టపోయింది. అయితే చివరకు 58 పాయింట్ల నష్టంతో కోలుకుంది. స్థూలంగా 35,907 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ పదకొండు పాయింట్లు కోల్పోయి 11,017 పాయింట్ల వద్ద ముగిసింది.
Samayam Telugu sensex nifty close lower on budget day
జైట్లీ బడ్జెట్: స్టాక్ మార్కెట్ నిరాశ


కార్పొరేట్ సెక్టార్ ఆశించిన తాయిలాలు ఏవీ యూనియన్ బడ్జెట్ తో అందకపోవడంతోనే మార్కెట్ వర్గాలు నిరాశ పడ్డాయని ఎనలిస్టులు అంటున్నారు. బడ్జెట్ లో కేంద్రం ప్రధానంగా గ్రామీణ, వ్యవసాయ రంగాల మీదే దృష్టి సారించినట్టుగా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఆ ప్రభావం మార్కెట్ మీద పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మార్కెట్ ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ప్రసంగం లేకపోవడంతో అమ్మకాలు మొదలయ్యాయి. ఫలితంగా సూచీలు బేర్ మన్నాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును మళ్లీ తీసుకురావడం, ద్రవ్యలోటు అధికంగా ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పడం, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎనభై వేల కోట్ల రూపాయల వరకే ఉండటం వంటి రీజన్లు మదుపరులను నిరాశ పరిచాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.