కేంద్రం భారీ ప్రకటనలు.. పట్టాలపైకి కొత్తగా 10 రైళ్లు?
దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బడ్జెట్ 2022 వచ్చే నెల 1వ తేదీన ప్రజల ముందుకు రాబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా భారీ ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బడ్జెట్పై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu 19 Jan 2022, 9:38 pm
ప్రధానాంశాలు:
- వచ్చే నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్
- రైల్వే బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉండే అవకాశం
- కొత్తగా 10 రైళ్లు అందుబాటులోకి
- హై స్పీడ్ రైల్వే నెట్వర్క్పై ఫోకస్
దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బడ్జెట్ 2022 వచ్చే నెల 1వ తేదీన ప్రజల ముందుకు రాబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా భారీ ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బడ్జెట్పై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే రైల్వే బడ్జెట్ను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కేవలం మధ్య తరగతి ప్రజలు మాత్రమే కాకుండా.. ఉన్నత వర్గం కూడా ఇటీవల రైళ్లలో ప్రయాణించడం మొదలుపెట్టింది. రైళ్లలో ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేయనుందని తెలుస్తోంది. 10 కొత్త రైళ్లు అందుబాటులోకి...
దేశానికి భారతీయ రైల్వే జీవనరేఖగా ఉంది. భారతీయ రైల్వే దేశ ప్రజలను అఫర్డబుల్ ధరలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చడమే కాకుండా.. ప్రభుత్వానికి కీలకమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. పలు మీడియా రిపోర్టుల పరకారం, కేంద్ర ప్రభుత్వం ఈసారి రైల్వే బడ్జెట్ను 15 శాతం పెంచనుందని తెలుస్తోంది. అంతేకాక ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, 10 కొత్త రైళ్లను ప్రకటించబోతుంది. వందే భారత్ పట్టాలపై ఈ 10 ట్రైన్లు ల్యాండ్ కాబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ కోసం కూడా కేంద్ర పలు కీలక ప్రకటనలు చేయనుంది. ప్రస్తుతం హై స్పీడ్ రైల్వే నెట్వర్క్పై ప్రభుత్వం బాగా ఫోకస్ చేసింది.
Also Read : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్లో ప్రోత్సాహకాలు వచ్చేస్తున్నాయ్500 రైల్వే స్టేషన్లు పునరుద్ధరణ...
500 రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ చేయనున్నట్టు కూడా కేంద్ర బడ్జెట్లో ప్రకటించబోతున్నారు. ఇది మాత్రమే కాక, ఎలక్ట్రిసిటీ, డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, హైడ్రోజెన్, బయోఫ్యూయల్, సోలార్ ఎనర్జీ ట్రైన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలో రైలు మార్గాలన్నింటిన్ని 100 శాతం విద్యుద్దీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : మీ దగ్గర చినిగిపోయిన నోట్లున్నాయా..? అయితే ఇలా చేయండి!
దేశానికి భారతీయ రైల్వే జీవనరేఖగా ఉంది. భారతీయ రైల్వే దేశ ప్రజలను అఫర్డబుల్ ధరలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చడమే కాకుండా.. ప్రభుత్వానికి కీలకమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. పలు మీడియా రిపోర్టుల పరకారం, కేంద్ర ప్రభుత్వం ఈసారి రైల్వే బడ్జెట్ను 15 శాతం పెంచనుందని తెలుస్తోంది. అంతేకాక ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, 10 కొత్త రైళ్లను ప్రకటించబోతుంది. వందే భారత్ పట్టాలపై ఈ 10 ట్రైన్లు ల్యాండ్ కాబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ కోసం కూడా కేంద్ర పలు కీలక ప్రకటనలు చేయనుంది. ప్రస్తుతం హై స్పీడ్ రైల్వే నెట్వర్క్పై ప్రభుత్వం బాగా ఫోకస్ చేసింది.
Also Read : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్లో ప్రోత్సాహకాలు వచ్చేస్తున్నాయ్500 రైల్వే స్టేషన్లు పునరుద్ధరణ...
500 రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ చేయనున్నట్టు కూడా కేంద్ర బడ్జెట్లో ప్రకటించబోతున్నారు. ఇది మాత్రమే కాక, ఎలక్ట్రిసిటీ, డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, హైడ్రోజెన్, బయోఫ్యూయల్, సోలార్ ఎనర్జీ ట్రైన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలో రైలు మార్గాలన్నింటిన్ని 100 శాతం విద్యుద్దీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : మీ దగ్గర చినిగిపోయిన నోట్లున్నాయా..? అయితే ఇలా చేయండి!