యాప్నగరం

ఇది చారిత్రాత్మక బడ్జెట్ సమావేశం: రాష్ట్రపతి

స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలిసారి సాధారణ, రైల్వే బడ్జెట్‌లను కలిపి ప్రవేశపెడుతున్నామని, ఇది చారిత్రాత్మక బడ్జెట్ సమావేశమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

TNN 31 Jan 2017, 12:25 pm
స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలిసారి సాధారణ, రైల్వే బడ్జెట్‌లను కలిపి ప్రవేశపెడుతున్నామని, ఇది చారిత్రాత్మక బడ్జెట్ సమావేశమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రణబ్ ప్రసంగించారు. ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ తమ ప్రభుత్వ నినాదమని ఆయన వెల్లడించారు. ఇటీవల నల్లధనంపై తమ ప్రభుత్వం చేసిన యుద్ధం ఎప్పటికి చెరిగిపోని ముద్రగా నిలిచిపోతుందని కొనియాడారు. అవినీతి, నల్లధనం నిర్మూలను ప్రజలు సహకరించడం వల్లే మా ప్రయత్నం సఫలమైందని తెలిపారు.
Samayam Telugu this is a historic union budget session president pranab mukherjee
ఇది చారిత్రాత్మక బడ్జెట్ సమావేశం: రాష్ట్రపతి


నిరుపేదలు, దళితులు, వంచనకు గురవుతున్నవారి సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రణబ్ చెప్పారు. పేద ప్రజల జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ ద్వారా సుమారు 5.6 కోట్ల మందికి రూ. 2 లక్షల కోట్ల రుణాలు అందిచామని చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘దీన్ దయాల్ అంత్యోదయ యోజన’ ద్వారా రూ.16వేల కోట్లు స్వయం ఉపాధి సంఘాలకు అందజేశామన్నారు. ఉజ్వల లబ్ధిదారుల్లో 37 శాతం మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉండటం మంచి పరిణామమన్నారు.

పోరాట దళాల్లో మహిళలు చేరుతున్నారని, తమ ప్రభుత్వం మహిళా సాధికారికతను సాధించగలదు అనడానికి ఇదొక ఉదాహరణ అని ప్రణబ్ చెప్పారు. మన మహిళా శక్తిని క్రీడాకారిణిలు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ చాటి చెప్పారని గుర్తుచేసారు. మహిళలకు ఉపాధి కల్పించడానికి తమ ప్రభుత్వం రూ.6000 కోట్ల ప్యాకేజీని విడుదల చేసిందని, దీనితో మహిళలకు 1.1 కోట్ల ఉద్యోగాలు లభించాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.