మోదీ ప్రభుత్వం సరికొత్త భారత్ను నిర్మించాలని నిజంగానే భావిస్తే.. విద్యా రంగానికి కచ్చితంగా అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే అందరికీ నాణ్యమైన విద్య అందిచడం వీలుకాకపోవచ్చు. అయితే ఇందుకు ఒక మార్గమైతే అందుబాటులో ఉంది. అదే డిజిటల్ ఎడ్యుకేషన్. మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియాకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘పేద ప్రజలు లక్షయంగా డిజిటల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గ్రామాల్లో పిల్లలకు ఎలాంటి విద్య అందుతోంది మీరే ఆలోచించండి. దేశంలోని అన్ని గ్రామాలు బ్రాండ్బ్యాండ్ కనెక్టివిటీతో అనుసంధానమైతే ప్రతి మూరుమూల గ్రామంలోనే నాణ్యమైన విద్య అందించొచ్చు’ అని మాట్లాడారు.
అయితే చెప్పిన మాటలకు చేసే చేతలకు మాత్రం పొంతన లేకుండా పోతోంది. ఎందుకంటారేమో.. డిజిటల్ లెర్నింగ్ అండ్ ఈ-బుక్స్పై పన్ను బాదుడు కొనసాగుతోంది. ఇది మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలకు పూర్తి విరుద్దంగా ఉంది. ప్రస్తుతం డిజిటల్ ఎడ్యుకేషన్పై 18 శాతం పన్ను ఉంది. మారుమూల గ్రామాలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలని కేంద్రం భావిస్తే.. జూలై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో డిజిటల్ డిజిటల్ ఎడ్యకేషన్పై జీఎస్టీ లేకుండా చేయాలని పరిశ్రమ నిపుణులు కోరుకుంటున్నారు.
అధిక పన్నులు కారణంగా డిజిటల్ ఎడ్యుకేషన్పై రెండు రకాలుగా ప్రభావం పడుతుంది. ప్రైవేట్ రంగ కంపెనీలు అందించే డిజిటల్ లెర్నింగ్ కంటెంట్ అండ్ సర్వీసెస్పై 18 శాతం జీఎస్టీ ఉంది. ఎడ్యుకేషన్ స్టార్టప్ గురుక్యూ ఫౌండర్ మినల్ ఆనంద్ ఇది ఏమాత్రం సమర్థణీయం కాదని, అన్యాయమని అభిప్రాయపడ్డారు.
‘స్కూళ్లు, కాలేజీలకు వెలుపల అన్ని రకాల ఎడ్యుకేషన్ సర్వీసెస్పై జీఎస్టీ రేటు 18 శాతంగా ఉంది. చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, ఇతర లగ్జరీ ప్రొడక్టులపై కూడా ఇదే రకమైన పన్ను విధించారు. విద్య, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం అనేవి లగ్జరీ విషయాలు కాదు. రెండింటిపై ఒకేరకమైన పన్ను విధించడం సరైంది కాదు’ అని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
అలాగే రెండో విషయానికి వస్తే ఇ-బుక్స్పై పన్ను విధింపు కూడా వెర్రి అనుకోవచ్చు. 2018 వరకు ఈ రెండూ 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్నాయి. 2018 జూలైలో జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ప్రింట్ వెర్షన్ కలిగిన ఈ-బుక్స్కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రింట్ చేసిన టెక్స్బుక్స్పై ఎలాంటి జీఎస్టీ లేదు.
మోదీ ఒకటి భావిస్తే.. ఆయన ట్యాక్స్ టీమ్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. డిజిటల్ విద్యను లగ్జరీగా భావిస్తున్నారు. డిజిల్ లెర్నింగ్పై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ రహిత జాబితాలో దీన్ని చేర్చాలి. అలాగే పిల్లలకు ఆన్లైన్ లెర్నింగ్ ప్రోత్సహించే తల్లిదండ్రులకు పన్ను రాయితీలు కల్పించాలి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొనుగోలుకు చేయూతనందించాలి. తద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించాలి.
బ్యాంకులు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్కు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొనుగోలుకు విద్యార్థులకు రుణాలు అందించాలి. ఈ చర్యలు తీసుకోకపోతే డిజిటల్ ఎడ్యుకేషన్ కేవలం మాటాలకు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమౌతుంది.
అయితే చెప్పిన మాటలకు చేసే చేతలకు మాత్రం పొంతన లేకుండా పోతోంది. ఎందుకంటారేమో.. డిజిటల్ లెర్నింగ్ అండ్ ఈ-బుక్స్పై పన్ను బాదుడు కొనసాగుతోంది. ఇది మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలకు పూర్తి విరుద్దంగా ఉంది. ప్రస్తుతం డిజిటల్ ఎడ్యుకేషన్పై 18 శాతం పన్ను ఉంది. మారుమూల గ్రామాలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలని కేంద్రం భావిస్తే.. జూలై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో డిజిటల్ డిజిటల్ ఎడ్యకేషన్పై జీఎస్టీ లేకుండా చేయాలని పరిశ్రమ నిపుణులు కోరుకుంటున్నారు.
అధిక పన్నులు కారణంగా డిజిటల్ ఎడ్యుకేషన్పై రెండు రకాలుగా ప్రభావం పడుతుంది. ప్రైవేట్ రంగ కంపెనీలు అందించే డిజిటల్ లెర్నింగ్ కంటెంట్ అండ్ సర్వీసెస్పై 18 శాతం జీఎస్టీ ఉంది. ఎడ్యుకేషన్ స్టార్టప్ గురుక్యూ ఫౌండర్ మినల్ ఆనంద్ ఇది ఏమాత్రం సమర్థణీయం కాదని, అన్యాయమని అభిప్రాయపడ్డారు.
‘స్కూళ్లు, కాలేజీలకు వెలుపల అన్ని రకాల ఎడ్యుకేషన్ సర్వీసెస్పై జీఎస్టీ రేటు 18 శాతంగా ఉంది. చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, ఇతర లగ్జరీ ప్రొడక్టులపై కూడా ఇదే రకమైన పన్ను విధించారు. విద్య, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం అనేవి లగ్జరీ విషయాలు కాదు. రెండింటిపై ఒకేరకమైన పన్ను విధించడం సరైంది కాదు’ అని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
అలాగే రెండో విషయానికి వస్తే ఇ-బుక్స్పై పన్ను విధింపు కూడా వెర్రి అనుకోవచ్చు. 2018 వరకు ఈ రెండూ 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్నాయి. 2018 జూలైలో జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ప్రింట్ వెర్షన్ కలిగిన ఈ-బుక్స్కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రింట్ చేసిన టెక్స్బుక్స్పై ఎలాంటి జీఎస్టీ లేదు.
మోదీ ఒకటి భావిస్తే.. ఆయన ట్యాక్స్ టీమ్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. డిజిటల్ విద్యను లగ్జరీగా భావిస్తున్నారు. డిజిల్ లెర్నింగ్పై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ రహిత జాబితాలో దీన్ని చేర్చాలి. అలాగే పిల్లలకు ఆన్లైన్ లెర్నింగ్ ప్రోత్సహించే తల్లిదండ్రులకు పన్ను రాయితీలు కల్పించాలి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొనుగోలుకు చేయూతనందించాలి. తద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించాలి.
బ్యాంకులు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్కు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొనుగోలుకు విద్యార్థులకు రుణాలు అందించాలి. ఈ చర్యలు తీసుకోకపోతే డిజిటల్ ఎడ్యుకేషన్ కేవలం మాటాలకు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమౌతుంది.