ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్-2019లో మహిళల నాయకత్వానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్థిక భరోసా కలిగేలా స్వయం సహాయక సంఘాలకు వరాలు ప్రకటించారు. స్వయం సహాయక సంఘాలకు ముద్ర యోజన వర్తింపజేస్తామని ప్రకటించారు. ముద్ర యోజన కింద స్వయం మహిళా సంఘంలోని ప్రతి ఒక్క సభ్యురాలికి రూ.లక్ష చొప్పున రుణం మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. దీనికి తోడు జన్ధన్ ఖాతా కలిగివున్న ప్రతి మహిళకు రూ.5వేల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
నిధుల కోసం ఇబ్బందులు పడే చిరు వ్యాపారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015, ఏప్రిల్ 8వ తేదీన ‘ముద్ర యోజన’ పథకాన్ని ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) పేరుతో చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీ రేటుకే రూ.10లక్షల వరకు రుణాలను కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు చిరు వ్యాపారులకే ముద్ర రుణాలు.. ఇకపై స్వయం సహాయక సంఘాలకు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు.
నిధుల కోసం ఇబ్బందులు పడే చిరు వ్యాపారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015, ఏప్రిల్ 8వ తేదీన ‘ముద్ర యోజన’ పథకాన్ని ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) పేరుతో చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీ రేటుకే రూ.10లక్షల వరకు రుణాలను కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు చిరు వ్యాపారులకే ముద్ర రుణాలు.. ఇకపై స్వయం సహాయక సంఘాలకు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు.