యాప్నగరం

బంగారు రుణాలపై ఆర్బీఐ మరో సంచలన ప్రకటన!

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు బంగారంపై నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

TNN 9 Mar 2017, 10:18 pm
రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు బంగారంపై నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు బంగారంపై రూ.లక్ష వరకూ నగదు రూపంలోనూ ఆపై మొత్తాన్ని చెక్కురూపంలో చెల్లిస్తున్నాయి. బంగారు రుణాలు చెల్లింపును రూ.25వేల పరిమితం చేస్తూ ఈ మేరకు ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu  nbfc cash loan against gold restricted to rs 25000 rbi
బంగారు రుణాలపై ఆర్బీఐ మరో సంచలన ప్రకటన!


డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా నగదు లావాదేవీలను తగ్గించడానికి వీలైనన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.25వేలకు తగ్గించాం అని ఆర్‌బీఐ తాజా ప్రకటనలో పేర్కొంది.

చలామణిలో ఉన్న పెద్దనోట్ల రద్దు చేసిన తర్వాత నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా బ్యాంకు ఖాతాల నిర్వహణ లావాదేవీలపై కూడా రుసుములు విధించనున్నట్లు చేసిన ప్రకటన సామాన్యుల పాలిటి శరాఘాతమే. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి రానుంది. అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకోవాలనుకునే వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. నోట్ల రద్దు తర్వాత 86 శాతం నగదు రెండు నెలల్లోనే బ్యాంకులకు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.