యాప్నగరం

రూ.7వేల కోట్ల రీఫండ్ల‌ను పూర్తిచేసిన కేంద్రం

ఎగుమతిదారులకు బకాయి ఉన్నటువంటి మొత్తంలో సగం వరకు రిఫండ్స్‌ పూర్తి చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) వెల్లడించింది

Samayam Telugu 10 Jun 2018, 3:52 pm
Samayam Telugu Gst refunds
ఎగుమ‌తిదార్ల‌కు జీఎస్టీ రీఫండ్లు
ఎగుమతిదారులకు బకాయి ఉన్నటువంటి మొత్తంలో సగం వరకు రిఫండ్స్‌ పూర్తి చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) వెల్లడించింది. ఈనెలలో గడిచిన 9రోజులలో ఇప్పటివరకు రూ.రూ.7,000 కోట్ల జీఎస్‌టీ రిఫండ్స్‌ జరిగినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

పెండింగ్‌ రిఫండ్స్‌ పూర్తి చేయడం కోసం స్పెషల్ రిఫండ్ ఫోర్ట్‌నైట్‌ పేరుతో డ్రైవ్‌ను ఏర్పాటుచేశామని వివరించిన సీబీఐసీ.. దీని ద్వారా బకాయిలను త్వరితగతిన పొందాల్సిందిగా ట్రేడర్లను కోరినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే రూ.14000 కోట్ల రిఫండ్స్‌లో సగం పూర్తిచేసినట్లు తెలిపింది. కేవలం పాన్‌ కార్డ్‌ నెంబర్‌ ఆధారంగానే డ్రైవ్‌ నడుస్తుండగా.. జీఎస్‌టీఐఎస్‌లో షిప్పింగ్‌ బిల్‌, రిటర్న్‌ ఫామ్‌ల అసమతుల్యత ఏమైనా ఉంటే పాన్‌ సరిపోతుందని వివరించింది. మే 31 నుంచి జూన్ 14, 2018 వరకు ఈ డ్రైవ్‌ ఉంటుందని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.