యాప్నగరం

ఉద్యోగులకు మోదీ శుభవార్త? అక్టోబర్ నుంచి..

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో తీపికబురు అందించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. దీంతో ఉద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది.

Samayam Telugu 19 Jul 2021, 12:53 pm

ప్రధానాంశాలు:

  • ఉద్యోగులకు తీపికబురు అందనుందా?
  • అందుకే మోదీ సర్కార్ ఒకే చెబుతుందా?
  • అక్టోబర్ నుంచి కొత్త రూల్స్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu modi
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు తీపికబురు అందించింది. డీఏ పెంపునకు ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు ఇదే కాకుండా రానున్న కాలంలో ఉద్యోగులకు మరో తీపికబురు కూడా అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకురాబోతోంది.
దీని వల్ల ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. మోదీ సర్కార్ అక్టోబర్ నెల నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే.. కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే.. ఉద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది. ఎర్న్‌డ్ లీవ్స్ పెరగనున్నాయి.

Also Read: undefined

వర్కింగ్ అవర్స్, వార్షిక సెలవులు, పెన్షన్, పీఎఫ్, టేకోమ్ శాలరీ, రిటైర్మెంట్ వంటి పలు అంశాల గురించి కార్మిక శాఖ, లేబర్ యూనియన్, ఇతర పరిశ్రమ సంబంధిత వర్గాలతో చర్చలు జరిగాయి. ఇందులో ఎర్న్‌డ్ లీవ్స్ కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వీటిని గరిష్టంగా 300 వరకు అక్యుములేట్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని లేబర్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచే కొత్త లేబర్ కోడ్స్‌ను అమలులోకి తీసుకురావాలని భావించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వీటి అమలుకు కొంత సమయం కావాలని కోరాయి. అందువల్ల కార్మిక చట్టాల అమలు సెప్టెంబర్ చివరి వరకు వాయిదా పడింది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. ఎర్న్‌డ్ లీవ్స్ పెంచాలనే డిమాండ్‌కు కేంద్రం ఓకే చెబితే.. ఉద్యోగులు గరిష్టంగా 300 వరకు ఎర్న్‌డ్ లీవ్స్ పొందొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.