యాప్నగరం

ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త.. కీలక నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కింద బిల్లుల సమర్పణకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది. మే నెల చివరి వరకు బిల్లులు సమర్పించొచ్చు.

Samayam Telugu 11 May 2021, 5:48 pm

ప్రధానాంశాలు:

  • కేంద్రం కీలక నిర్ణయం
  • ఆ గడువు పొడిగింపు
  • చాలా మందికి ఊరట

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pm modi
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఊరట కలిగే ప్రకటన చేసింది. లీవ్ ట్రావెల్ కన్సీషన్ LTC అంశానికి సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించింది. ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కింద బిల్లుల చెల్లింపునకు గుడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులు వారి ట్రావెల్ బిల్లులను ఇప్పుడు కూడా చెల్లించొచ్చు. మే 31 వరకు గడువు ఉంటుంది. ఈలోపు మీరు మీ బిల్లులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎల్‌టీసీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు తగ్గింపు లభిస్తుంది. పన్ను మినహాయింపు పొందొచ్చు.

Also Read: undefined

సాధారణంగా బిల్లుల సమర్పణకు ఏప్రిల్ 30తోనే గడువు ముగియాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా చాలా మంది ఉద్యోగులు వారి బిల్లులను సమర్పించాల్సి ఉంది. అందువల్లనే కేంద్రం గడువు పొడిగించింది.

ఉద్యోగులు ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌ను 4 ఏళ్లలో ఒకసారి మాత్రమే పొందాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారి ఉద్యోగి ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కింద బిల్లులు సమర్పిస్తే.. మళ్లీ నాలుగేళ్ల వరకు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందటానికి వీలు ఉండదు. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలో ఎక్కడికైనా ఫ్యామిలీతో ప్రయాణించొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.