యాప్నగరం

ఇకపై షేర్ మార్కెట్‌కూ ‘ఆధార్’ తప్పనిసరి!

దలాల్‌ స్ట్రీట్‌‌లో ఎంట్రీకి ఆధార్ గేట్‌కీపర్ కానుంది. ఫైనాన్షియల్‌ మార్కెట్‌ లావాదేవీలకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

TNN 10 Aug 2017, 2:18 pm
సంక్షేమ పథకాలు, బ్యాంక్‌ సేవలు, గ్యాస్ సబ్సిడీ.. ఇలా చాలా వాటికి తప్పనిసరి అయిన ఆధార్ ఇక మీదట షేర్ మార్కెట్‌కు తప్పనిసరి కానుంది. ఇకపై షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలుకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు. దీంతో దలాల్‌ స్ట్రీట్‌‌లో ఎంట్రీకి ఆధార్ గేట్‌కీపర్ కానుంది. ఫైనాన్షియల్‌ మార్కెట్‌ లావాదేవీలకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీనిపై సెబీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu aadhaar may become mandatory for share market mutual funds
ఇకపై షేర్ మార్కెట్‌కూ ‘ఆధార్’ తప్పనిసరి!


2009లో యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఆధార్‌ విధానాన్ని ఇటీవల అనేక పథకాలకు తప్పనిసరి చేస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాలు, పాన్‌ కార్డులు, ఫోన్‌ నంబర్లకు ఆధార్‌ నంబర్‌ ఉండాల్సిందేనని పేర్కొంది. ఇటీవల మరణ ధ్రువీకరణ పత్రాలకు కూడా ఆధార్‌ కార్డు అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

త్వరలో మార్కెట్లకు కూడా ఆధార్‌ను లింక్‌ చేయనున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న పాన్‌ కార్డుకు బదులుగా ఆధార్‌ను తప్పనిసరి చేస్తారా? లేదా ఆధార్‌, పాన్‌ కార్డులు రెండింటినీ తప్పనిసరి చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.