Aadhaar Benefits: ఆధార్ కార్డు కచ్చితంగా కావాల్సిందే. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలని భావించే వారు ఆధార్ నెంబర్ కచ్చితంగా అందించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సర్క్యూలర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆధార్ నెంబర్ లేని వారు, లేదంటే ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ లేని వారు ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, బెనిఫిట్స్ పొందలేరని యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఆధార్ రూల్స్ను మరింత కఠినంగా మార్చేసింది. ఈ మేరకు కేంద్రానికి చెందిన అన్ని ప్రభుత్వ రంగ శాఖలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసింది. అంగే ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు పొందే వారు ఇకపై ఆ బెనిఫిట్స్ ఏమీ పొందలేరు. యూఐడీఏఐ సర్య్యూలర్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తించే క్రమంలో కచ్చితంగా ఆధార్ కార్డు డాక్యుమెంట్ను పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే వారు, సబ్సిడీ, సర్వీసులను పొందాలని భావించే వారు కచ్చితంగా ఆధార్ నెంబర్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రూల్స్ ఉన్నా కూడా, రానున్న రోజుల్లో వీటి అమలు మరింత కట్టుదిట్టంగా జరగనుంది.
Also Read: undefined
ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 కింద ఆధార్ నెంబర్ను కేటాయించని వ్యక్తికి ప్రత్యామ్నాయ, ఆచరణీయమైన గుర్తింపు మార్గాల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలు, సేవలను పొందొచ్చు. అయితే ఆధార్ లేని వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించి, ఆ స్లిప్ను పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆధార్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ స్లిప్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీమ్స్ బెనిఫిట్స్ పొందగలం.
దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేసినట్లు యూఐడీఏఐ పేర్కొంటోంది. ఆధార్ కార్డు వల్ల ప్రజల జీవణ ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో చాలా వరకు ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అని గుర్తించుకోవాలి. అందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు.
Also Read: undefined
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read: undefined
ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 కింద ఆధార్ నెంబర్ను కేటాయించని వ్యక్తికి ప్రత్యామ్నాయ, ఆచరణీయమైన గుర్తింపు మార్గాల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలు, సేవలను పొందొచ్చు. అయితే ఆధార్ లేని వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించి, ఆ స్లిప్ను పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆధార్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ స్లిప్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీమ్స్ బెనిఫిట్స్ పొందగలం.
దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేసినట్లు యూఐడీఏఐ పేర్కొంటోంది. ఆధార్ కార్డు వల్ల ప్రజల జీవణ ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో చాలా వరకు ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అని గుర్తించుకోవాలి. అందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు.
Also Read: undefined
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.