యాప్నగరం

చైనా నుంచి భారత్ తరలి రానున్న 200 అమెరికా కంపెనీలు!

చైనాలో ఉత్పత్తి సాగిస్తోన్న 200 అమెరికా కంపెనీలు భారత్ తరలివచ్చే దిశగా యోచిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Samayam Telugu 27 Apr 2019, 7:40 pm
అమెరికాకు చెందిన 200 కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ బేస్‌ను చైనా నుంచి భారత్ తరలించాలని యోచిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. చైనాకు ప్రత్యామ్నాయం కోసం అమెరికా కంపెనీలు చూస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై అమెరికా కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) అధ్యక్షుడు ముకేశ్‌ ఆఘి తెలిపారు.
Samayam Telugu make in india1


కంపెనీలు భారత్‌కు రావడానికి వీలుగా సంస్కరణలను వేగవంతం చేయాలని, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకత పాటించాలని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ కొత్తగా కొలువుదీరే సర్కారును కోరనుంది. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ అజెండా ఉండాలని ఆఘి సూచించారు.

‘‘గత 12-18 నెలల్లో యూఎస్‌ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు గమనిస్తున్నాం. డేటా లోకలైజేషన్‌, ఈ కామర్స్‌ లాంటి అంశాల్లో స్థానికతకు పెద్దపీట వేసే దిశగా యోచిస్తున్నాయి. అమెరికా సంస్థలను ఆకర్షించడానికి వీలుగా భూసేకరణ నుంచి పన్ను చెల్లింపుల ప్రక్రియ వరకు పలు అంశాల్లో సంస్కరణల్ని వేగవంతం చేయాలి. తద్వారా భారీ స్థాయిలో ఉద్యోగాలను కల్పించొచ్చు’’ అని ముకేశ్‌ అభిప్రాయపడ్డారు.

భారత్, అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రతిపాదన భారత్‌కు లబ్ధి చేకూరుస్తుందని ముకేశ్ తెలిపారు. ఎఫ్‌టీఏ ద్వారా అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయన్న ఆయన.. చైనా చౌక వస్తువుల దిగుమతి సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.