యాప్నగరం

Adani Enterprises: అదానీ కంపెనీ అదరగొట్టింది.. వందల కోట్ల లాభం.. వేల కోట్ల ఆదాయం.. కళ్లు చెదిరేలా ఫలితాలు!

Adani Enterprises: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో (Hindenburg Research Report) ఒకవైపు అదానీ గ్రూప్ స్టాక్స్ పడిపోతున్నా.. మరోవైపు అదానీ కంపెనీ లాభాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కళ్లు చెదిరే ఫలితాల్ని ప్రకటించింది. లాభం, ఆదాయం భారీగా పెరగడం విశేషం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 15 Feb 2023, 4:28 pm
Adani Enterprises: దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ (Adani Groups Market Cap).. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో.. అదానీ కంపెనీల షేర్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. అయితే ఈ సమయంలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ మాత్రం అదరగొట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు చూస్తే మీరు కూడా ఇలా అనాల్సిందే. ఏకీకృత ప్రాతిపదికన ఈ అదానీ కంపెనీ నికర లాభం ఏకంగా రూ.820 కోట్లుగా నమోదైంది. అక్టోబర్- నవంబర్ పనితీరు ఇలా ఉందన్నమాట. ఇక గతేడాది ఇదే సమయంలో నష్టాల్లో ఉండటం గమనార్హం. అప్పుడు రూ.11.63 కోట్ల మేర నష్టపోయింది.
Samayam Telugu adani enterprises results


ఇక కంపెనీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆపరేషన్స్ వచ్చే రెవెన్యూ 42 శాతం ఎగబాకి.. రూ.26,612.2 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.18,757.9 కోట్లుగా మాత్రమే ఉంది. బ్లూమ్‌బర్గ్ అంచనాలను మించి అదానీ కంపెనీ లాభాలను నమోదు చేయడం విశేషం. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.582.80 కోట్ల లాభం.. రూ.29,245 కోట్ల ఆదాయం నమోదు చేస్తుందని అంచనా వేసింది బ్లూమ్‌బెర్గ్. ఇటీవల అదానీ పవర్, అదానీ పోర్ట్స్ వంటి ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు మాత్రం మూడో త్రైమాసిక ఫలితాల్లో కాస్త నిరాశపరిచాయి.
Linkedin: జాబ్ నోటిఫికేషన్ల కోసం చూసే లింక్డ్‌ఇన్‌లోనూ Layoffs.. ఇదీ అసలు పరిస్థితి!
ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మాత్రం.. రూ.460 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇక అదానీ గ్రూప్‌కు చెందిన స్టాక్స్ అన్నీ ఇవాళ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. చాలా వరకు లోయర్ సర్క్యూట్‌ కొట్టాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అద్భుత లాభాల ప్రకటన అనంతరం.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ మళ్లీ పుంజుకున్నాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర గత నెల వ్యవధిలో ఏకంగా 50 శాతానికిపైగా పతనమైంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణల నేపథ్యంలో.. అదానీ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోయాయి. జనవరి 25న హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదలైంది. స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్.. అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించింది. స్టాక్ మానిపులేషన్ చేస్తున్నట్లు చెప్పింది. దీనిపై అదానీ గ్రూప్ 423 పేజీల రెస్పాన్స్ కూడా ఇచ్చింది. అయినా మదపరులు తీవ్ర అమ్మకాలు జరపగా.. స్టాక్స్ పతనమవుతూనే ఉన్నాయి. దీంతో అదానీ సంపద కూడా లక్షల కోట్ల మేర పడిపోయింది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13 ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్లకుపైగా నష్టపోయింది. అంటే ఇదంతా ఇన్వెస్టర్ల సొమ్ము అన్నమాట. ప్రస్తుతం ఈ అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది.

Best Credit Card: మీకు సరైన క్రెడిట్ కార్డును ఎలా ఎంపిక చేసుకోవాలో ఇక్కడ చూడండి..! Adani Group: అదానీ గ్రూప్ కీలక ప్రకటన.. అంతా బానే ఉంది.. నిధులొస్తాయ్ అంటూ..!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.