యాప్నగరం

Bridge Loan: చేతల్లో చూపిస్తున్న గౌతమ్ అదానీ.. మళ్లీ గడువుకు ముందే వేల కోట్ల అప్పు చెల్లింపు.. ఇక తిరుగులేదా?

Bridge Loan Adani: అమెరికా కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బకు అదానీ గ్రూప్‌కు తీరని నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారు గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున అప్పులను తిరిగి చెల్లిస్తున్నారు. తాజాగా మరోసారి గడువుకు ముందే రుణం చెల్లించడం విశేషం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 25 Mar 2023, 10:07 am
Bridge Loan Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani).. తన మాట నిలబెట్టుకుంటున్నారు. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం పెంపొందించుకునే ప్రయత్నంలో భాగంగా ఇటీవల అప్పులను క్రమంగా చెల్లిస్తానని చెబుతున్న అదానీ ఒక్కో పని చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జ్ లోన్‌ తిరిగి చెల్లించినట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. ఇది భారత కరెన్సీలో రూ.4 వేల కోట్లకుపైనే కావడం విశేషం. అమెరికా షార్ట్‌సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ (Hindenburg Report) నేపథ్యంలో Adani Group షేర్లు భారీగా పడిపోయాయి. గ్రూప్‌కు ఏకంగా రూ.12 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పతనమైంది. ఇక ఇటీవల మాత్రం అదానీ వరుస ప్రకటనలతో అదానీ కంపెనీల షేర్లు పుంజుకుంటున్నాయి.
Samayam Telugu adani bridge loan


ఇక ఈ లోన్ గడువు గురువారం ఉండగా.. ముందే రుణదాతలకు సంబంధిత డబ్బులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనంతరం అదానీ షేర్లు పతనమై.. సంపద పతనమైన క్రమంలో అదానీ గ్రూప్‌కు రీఫైనాన్సింగ్ చేసేందుకు చాలా బ్యాంకులు వెనుకంజ వేసినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఫిబ్రవరిలో నివేదించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అదానీ తన అప్పులను చెల్లిస్తున్నారు.

GQG Partners: అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం.. బ్లాక్ డీల్స్ చేసిన దిగ్గజ కంపెనీ మరోసారి ఇన్వెస్టర్లకు భరోసా! Rajiv Jain: అదానీ గ్రూప్‌లో ఇప్పుడు వేల కోట్ల వాటా కొన్నదెవరో తెలుసా? ఆ వ్యూహంతోనే పకడ్బందీగా..!

అదానీ గ్రూప్ కొద్దిరోజుల కిందట 2 బిలియన్ డాలర్ల వరకు షేర్డ్ బ్యాక్డ్ లోన్లను తిరిగి చెల్లించారు. భారత కరెన్సీలో ఇది రూ.16 వేల కోట్లకుపైనే. అంటే ప్రమోటర్ల షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలను చెల్లించారు. దీంతో ఆ కోట్లాది షేర్లు తిరిగి విడుదలయ్యాయి. మరోవైపు బాండ్ చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారు అదానీ. ఇక ఇదే సమయంలో ఇటీవల పెద్ద ఎత్తున అదానీ గ్రూప్‌లో రూ.15 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ GQG Partners. దీంతో అదానీ స్టాక్స్ పుంజుకుంటున్నాయి. దీంతో అదానీ నష్టాలు పూడుతున్నాయి. ఇప్పుడు మరి ఈ ప్రకటన అదానీ షేర్లు మరింత పెరిగేందుకు ఎంత వరకు కారణం అవుతుందో చూడాలి.

Adani Stocks Block Deals: అదానీ బ్లాక్ డీల్స్.. 4 కంపెనీల్లో వాటాల విక్రయం.. చేతులు మారిన కోట్లాది షేర్లు!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.