యాప్నగరం

Bonus: ఉద్యోగులకు మొన్న 50 నెలల జీతం బోనస్.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్.. కలలో ఊహించని రీతిలో ప్రకటనలు!

Bonus: ఉద్యోగులకు సాధారణంగా కంపెనీలు బోనస్‌లు ప్రకటించడం చూస్తుంటాం. ఇవి నెల జీతం, లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. అయితే ఒక కంపెనీ ఇటీవల ఉద్యోగులకు ఏకంగా 50 నెలల బోనస్ ఇచ్చింది. ఇప్పుడు మరో భారీ బహుమతి ఇవ్వనుంది. దీంతో వారు ఎగిరి గంతేస్తున్నారు. ఇక వార్తలోకి వెళ్తే..

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 23 Mar 2023, 10:32 am
Bonus: తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ (Evergreen Marine Corporation).. కొద్ది రోజుల కిందట ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. తమ సంస్థ ఉద్యోగులకు ఒకేసారి ఏకంగా 50 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అంటే ఇది 4 సంవత్సరాలకు సరిపడా వేతనమన్నమాట. ఇంకేం వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతలోనే ఆ సంబంరంలో ఉండగానే ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. ఆ ఉద్యోగులు మరో భారీ బహుమతి అందుకోనున్నారు. ఈ షిప్పింగ్ కంపెనీకి పెద్ద మొత్తంలో రికార్డు స్థాయిలో ఆదాయం, లాభాలు వస్తుండటమే దీనికి కారణం. ఈ షిప్పింగ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లాభాలను అందుకుంది. దీంతో ఈ లాభాలను ఉద్యోగులతో పంచుకోనుంది.
Samayam Telugu Evergreen Marine Corporation


మొత్తం ఈ ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ కంపెనీలోని 3200 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు 62.8 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 500 కోట్లకుపైనే అందుకోనున్నారట. కంపెనీ ఈ వారంలోనే వార్షిక ఫలితాలు ప్రకటించనుంది. అప్పుడే ఈ చెల్లింపులు అందుకోనున్నారుట. అందరికీ సమానంగా ఈ లాభాలు పంచనుందంట.

కరోనా సమయంలో సప్లై చెయిన్ అవాంతరాల నేపథ్యంలో షిప్పింగ్ ఇండస్ట్రీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వినియోగ వస్తువులు, సరకు రవాణా కోసం సముద్ర రవాణా శ్రేయస్కరమని భావించగా.. వీటికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఎవర్‌గ్రీన్ మెరైన్‌కు ఊహించని రీతిలో లాభాలొచ్చాయి. ఇక ఎవర్‌గ్రీన్ మెరైన్ ఆర్టికల్స్ అసోసియేషన్ ప్రకారం.. సంస్థ తన ఆదాయంలో 0.5 శాతం ఉద్యోగులకు పరిహారంగా పంచనుంది. ఇక ఉద్యోగుల పనితీరును బట్టి బోనస్ చెల్లింపులు ఉంటాయని వెల్లడించింది. మరోవైపు ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ షేరు ధర కూడా ఇటీవలి కాలంలో భారీగా పుంజుకుంది.

బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం.. ఈ షిప్పింగ్ కంపెనీ జనవరిలో ఎంపిక చేసిన తన ఉద్యోగులకు 50 నెలలు లేదా 4 సంవత్సరాల కంటే ఎక్కువ వేతనాన్ని బోనస్ రూపంలో ఇచ్చింది. దీంతో అప్పట్లో ఉద్యోగులు నోట్ల కట్టలతో వెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో షిప్పింగ్ కంపెనీ కూడా వార్తల్లోకెక్కింది.

Huge Bonus: లక్కంటే వీళ్లదే.. 4 సంవత్సరాల జీతం బోనస్.. ఉద్యోగులకు ఈ కంపెనీ బంపర్ ఆఫర్!

Google Layoffs: తొలగించిన గూగుల్ ఉద్యోగులకు అత్యంత చేదు అనుభవం.. ఆ డబ్బులేం రావట! Rajalakshmi Vijay: జాగింగ్ చేస్తుండగా ఢీకొట్టిన కారు.. టెక్ కంపెనీ సీఈఓ దుర్మరణం.. ఎంత పనైంది!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.