యాప్నగరం

air india sale: ఎయిరిండియాను కొనేవారే లేరా!

ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాలను విక్రయించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు

Samayam Telugu 1 Jun 2018, 11:27 am
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాలను విక్రయించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. బిడ్డింగ్‌కు ఆఖరు రోజైన మే 31 నాటికి కూడా వాటాల కొనుగోలుకు ఏ సంస్థా ముందుకు రాలేదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను త్వరలో నిర్ణయించనున్నట్లు పౌర విమాన‌యాన శాఖ ట్విటర్‌లో పేర్కొంది. భారీ రుణాలు, నష్టాలు పేరుకుపోయిన ఎయిరిండియాలో వ్యూహాత్మకంగా 76 శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu Air India sales
ఎయిర్ ఇండియా విక్ర‌యంపై నీలినీడ‌లు!

ఎయిర్ ఇండియా విక్ర‌యం


ఎయిరిండియాతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరిండియా ఎస్‌ఏటీఎస్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ను కూడా విక్రయానికి ఉంచింది. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు ముందుగా మే 14 ఆఖరు తేదీగా నిర్ణయించినా.. మళ్లీ మే 31 దాకా పొడిగించారు. అర్హత పొందిన బిడ్డర్ల పేర్లను జూన్‌ 15న ప్రకటించాలని నిర్ణయించారు. ముందుగా ఇండిగో వంటి సంస్థలు కొంత ఆసక్తి చూపినప్పటికీ.. చివరికి ఏ సంస్థా కూడా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. గతేడాది మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 48,000 కోట్లుగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.