యాప్నగరం

Air India Signs Deal: టాటా గ్రూప్ చారిత్రక ఒప్పందం.. వందల విమానాలకు లక్షల కోట్లతో బిగ్ డీల్.. మోదీ సమక్షంలోనే..

Air India Signs Deal: దిగ్గజ టాటా గ్రూప్‌కు చెందిన విమానాయాన సంస్థ ఎయిరిండియా చరిత్ర సృష్టించింది. చారిత్రక ఒప్పందంలో భాగస్వామ్యమైంది. ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌బస్‌ ఎస్‌ఈతో ఏకంగా 250 విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది. ఈ ప్రకటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 14 Feb 2023, 5:37 pm
Samayam Telugu air india tata airbus
Air India Signs Deal: అనుకున్నదే జరిగింది. టాటా గ్రూప్ చరిత్ర సృష్టించింది. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఏకంగా ఒకేసారి 250 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. టాటా గ్రూప్‌ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం.. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎస్‌ఈతో భారీ డీల్ ఖరారు చేసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 14న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించింది ఎయిరిండియా. ఈ సందర్భంగా మాట్లాడిన టాటా సన్స్ ఛైర్‌పర్సన్ నటరాజన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా అంటే కేవలం మరో విమానయాన సంస్థ కాదని, ఇది లక్షల మంది భారతీయుల కలల్ని, ఆశల్ని కలిగి ఉందని చెప్పుకొచ్చారు.

ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఎయిరిండియా విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రకటన జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఎయిర్‌బస్ ఎస్‌ఈ సీఈఓ ఫౌరీ, ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో ఈ ఒప్పందం జరగడం విశేషం.

ఈ ఒప్పందంలో భాగంగా.. ఎయిరిండియాకు ఎయిర్‌బస్ నుంచి మొత్తం 250 ప్లేన్లు రానుండగా.. ఇందులో 210 Single-aisle A320neos, 40 వైడ్‌బాడీ A350s ఉన్నాయి. వీటి విలువ ఏకంగా 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. ఇది భారత కరెన్సీలో రూ.4.13 లక్షల కోట్లకుపైనే. ఇప్పటివరకు భారత్‌లో విమానాలకు సంబంధించి అతిపెద్ద ఆర్డర్ ఇదే కావొచ్చు. దీనికి అదనంగా.. ఎయిరిండియా మరో పెద్ద ఒప్పందం కూడా కుదుర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌తో మరో 250 విమానాలకు డీల్ కుదుర్చుకోనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.

Hiring: ఆర్థిక మాంద్యం భయాలు.. మంచి డిమాండ్ ఉన్న 5 ఉద్యోగాలు ఇవే.. మీరేం చేస్తున్నారు? Adani Enterprises: అదానీ కంపెనీ అదరగొట్టింది.. వందల కోట్ల లాభం.. వేల కోట్ల ఆదాయం.. కళ్లు చెదిరేలా ఫలితాలు! SBI Cards Rent Payments: బ్యాడ్‌న్యూస్.. ఎస్‌బీఐ బాదుడే బాదుడు.. ఏకంగా 100 శాతం పెరిగిన ఛార్జీలు!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.