యాప్నగరం

జియో ఉచిత ఆఫర్‌కు వ్యతిరేకంగా ఎయిర్‌టెల్ పోరాటం

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ అందించడాన్ని ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ. ట్రాయ్‌కు వ్యతిరేకంగా ఎయిర్‌టెల్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.

TNN 24 Dec 2016, 1:54 pm
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్‌‌ విషయంలో ట్రాయ్‌కు వ్యతిరేకంగా టెలీకాం వివాదాలను తీర్చే ట్రైబ్యునల్‌ను ఎయిర్‌టెల్ ఆశ్రయించింది. మార్చి చివరి వరకూ ఉచిత సేవలను అందిస్తామని జియో ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 90 రోజులకు మించి ఉచిత ఆఫర్‌ను అందించేందుకు జియోకు ఎలా అనుమతిస్తారంటూ ఎయిర్‌టెల్ ట్రాయ్‌ను ప్రశ్నించింది. సెప్టెంబర్ 5న జియో సేవలు ప్రారంభం కాగా.. డిసెంబర్ 3 తర్వాత కూడా ఆ సంస్థ ఉచిత సేవలను అందిస్తోన్న విషయాన్ని ట్రైబ్యునల్ దృషికి తీసుకొచ్చింది. 90 రోజులకు మించి ప్రమోషనల్ ఆఫర్లను అందించకుండా మార్గదర్శకాలను జారీ చేయాలని ట్రైబ్యునల్‌ను ఎయిర్‌టెల్ కోరింది. ట్రాయ్ విధించిన నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించింది. ఇంటర్ కనెక్ట్ ఛార్జీలు సహా ఇతర నిబంధనలను టెల్కోలు పాటిస్తున్నాయో లేదో నిర్ధారించుకునేలా ట్రాయ్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.
Samayam Telugu airtel challenges trais permission to jio to continue promo
జియో ఉచిత ఆఫర్‌కు వ్యతిరేకంగా ఎయిర్‌టెల్ పోరాటం


ఉచిత కాల్స్ వ‌ల్ల పెరిగిన ట్రాఫిక్‌తో త‌మ నెట్‌వ‌ర్క్ దెబ్బ‌తింటోంద‌ని, అందుకే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించింది. ట్రాయ్ నిబంధనలను కంపెనీలు ఉల్లంఘిస్తున్నప్పటికీ.. 90 రోజుల కంటే ఎక్కువగా ఉచిత ఆఫర్లను ప్రకటిస్తున్నప్పటికీ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ మౌన ప్రేక్షకుడి పాత్ర పోషిస్తోందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. జియోకు సరిపడా ఇంటర్ కనెక్ట్ పాయింట్లను కేటాయించలేదనే కారణంతో ట్రాయ్ వొడాఫోన్‌పై రూ. 1050 కోట్ల ఫెనాల్టీని విధించింది. దీంతో ట్రాయ్ నిర్ణయాన్ని వొడాఫోన్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.