రిలయన్స్ జియో... భారత టెలికాం వ్యవస్థలో ప్రకంపనలు పుట్టిస్తోంది. జియో సిమ్ కోసం క్యూలలో నిలబడి మరి ప్రజలు తీసుకుంటున్నారు. దీంతో తమ వినియోగదారుల సంఖ్య పడిపోయే అవకాశం ఉన్నట్టు ఇతర దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, వోడాఫోన్, బీఎస్ఎన్ ఎల్ గుర్తించాయి. ఎయిర్ టెల్ ముందుగానే మేల్కొని కొత్త పథకాల ప్రవేశ పెడుతోంది. నెలకి రూ.29 విలువగల ప్రీపెయిడ్ డేటా ప్యాక్ ను ప్రకటించింది. ఆ ప్యాక్ కింద 75 ఎంబీ 2జీ,3జీ,4జీ డేటా అందుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. జియో దెబ్బకి ఇంకా చాలా ఆఫర్లు ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తోంది ఎయిర్ టెల్.
జియో దెబ్బకి దిగొచ్చిన ఎయిర్ టెల్
రిలయన్స్ జియో... భారత టెలికాం వ్యవస్థలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
TNN 7 Sep 2016, 9:04 am