యాప్నగరం

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

రిలయెన్స్ జియో, వొడాఫోన్ తదితర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.349, రూ.549 ప్యాక్స్‌లో కీలక మార్పులు చేసింది.

TNN 6 Dec 2017, 9:16 pm
రిలయెన్స్ జియో, వొడాఫోన్ తదితర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.349, రూ.549 ప్యాక్స్‌లో కీలక మార్పులు చేసింది. ఆ ప్యాక్‌లపై 500 ఎంబీ అదనపు డేటాను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌ రూ.349 ప్లాన్‌ను సెప్టెంబర్‌లో తీసుకొచ్చింది. ప్రారంభంలో 1 జీబీ డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ అందించేది. జియో తన రీఛార్జి ప్లాన్లను సవరించడంతో నవంబర్‌లో ఎయిర్‌టెల్‌ సైతం రూ.349 ప్లాన్‌ను మార్పు చేసింది. రోజువారీ డేటా పరిమితిని 1.5 జీబీకి పెంచింది. ఇప్పుడు ఆ ప్లాన్‌పై అదనంగా 500 ఎంబీ డేటా అందిస్తోంది. అంటే 28 రోజులకు 2 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, 100 లోకల్‌ ఎస్టీడీ కాల్స్‌ లభిస్తాయన్నమాట.
Samayam Telugu airtel revises rs 349 rs 549 prepaid plans to offer more data benefits
ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్


ఇక రూ. 549 ప్లాన్‌పై ఇప్పటి వరకు 2.5 జీబీ డేటాను అందిస్తుండగా.. ఎయిర్‌టెల్ ఆ పరిమితిని 3 జీబీకి పెంచింది. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.