యాప్నగరం

దీపావళికి ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్..!

టెలికాం రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో.. కస్టమర్లను ఆకర్షించడానికి పలు సంస్థలు వినూత్న ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. తాజాగా దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను..

TNN 11 Sep 2017, 5:14 pm
టెలికాం రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో.. కస్టమర్లను ఆకర్షించడానికి పలు సంస్థలు వినూత్న ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. తాజాగా దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. రిలయన్స్ ముఖేశ్ అంబానీ రూ. 1500లకే తీసుకొచ్చిన జియో ఫీచర్‌ ఫోన్‌కు పోటీగా దీన్ని ప్రవేశ పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే పలు మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలతో చర్చించినట్లు సమాచారం.
Samayam Telugu airtel to launch 4g smartphone for rs 2500 to rival jio
దీపావళికి ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్..!


ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌‌ను దీపావళి కానుకగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ధర రూ. 2500 నుంచి రూ.2700 వరకూ ఉండే అవకాశముంది. దీని ద్వారా వినియోగదారులకు అతి తక్కువ ధరకు డేటా, వాయిస్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తేచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఎయిర్‌టెల్ తేనున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌‌లో 1 జీబీ ర్యామ్‌, డ్యుయల్‌ కెమెరా, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌, వీవోఎల్‌టీఈ సర్వీస్ లాంటి ఫీచర్లు ఉంటాయట. దీంతో పాటు 4 అంగుళాల టచ్ స్క్రీన్, మెరుగైన బ్యాటరీ లైఫ్ లాంటి ప్రత్యేకతలు కూడా ఉన్న ఈ ఫోన్ అతి చౌకైన ధరకే అందించడానికి కసరత్తు చేస్తున్నారట. మొత్తం మీద రిలయన్స్‌ జియో పుణ్యమా అని కస్టమర్లకు ఈవిధంగా కూడా మేలు జరగనుందన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.