యాప్నగరం

సర్‌ప్రైజింగ్ ఆఫర్‌తో ముందుకొస్తున్న ఎయిర్‌టెల్!

జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకుంటుండగా.. ఎయిర్‌ టెల్‌ కొత్త ఆఫర్లతో దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది.

TNN 6 Mar 2017, 7:33 pm
టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌ టెల్‌ సర్‌ప్రైజింగ్‌ ప్రమోషనల్ ఆఫర్‌తో ముందుకొస్తోంది. పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులకు ఉచిత డేటా సేవలు అందించనుంది. ఇది మార్చి 13 నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్‌ యూజర్లకు త్వరలో ఇ-మెయిల్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించనున్నారు.
Samayam Telugu airtel to offer free data from march 13
సర్‌ప్రైజింగ్ ఆఫర్‌తో ముందుకొస్తున్న ఎయిర్‌టెల్!


మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. దేశంలో అత్యంత వేగంగా మొబైల్ నెట్‌ వర్క్‌నుంచి ఈ సేవలను పొందొచ్చని ఎయిర్‌ టెల్‌ ఖాతాదారులు ఇప్పటికే ఇ-మెయిల్‌ పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ ద్వారా ఏ మేరకు డేటా సేవలను అందించనుందనే విషయంలో క్లారిటీ లేదు.

అన్‌ లిమిడెట్‌ కాలింగ్‌, అన్‌ లిమిటెడ్‌ డేటా అంటూ దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో ఏప్రిల్ 1 నుంచి చార్జ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకుంటుండగా.. ఎయిర్‌ టెల్‌ కొత్త ఆఫర్లతో దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇది రూ.345 రీఛార్జ్ ప్యాక్‌‌పై రోజూ 1 జీబీ డేటా అందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.