యాప్నగరం

జియోను మేం అనుసరించం: ఎయిర్‌టెల్

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలీకాం పరిశ్రమను ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే.

TNN 2 Nov 2016, 12:09 pm
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలీకాం పరిశ్రమను ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. అపరిమిత డాటా, వాయిస్ కాల్స్, మెసేజింగ్‌‌ను ఉచితంగా అందజేస్తూ వినియోగదారులను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన మిగిలిన ఆపరేటర్లు టారిఫ్‌లలో చాలా మార్పులు చేశారు. దేశంలోనే అతిపెద్ద టెలికాం నెటవర్క్ అయిన ఎయిర్‌టెల్ కూడా జియో దెబ్బకు తమ టారిఫ్‌ ప్లాన్లలో మార్పులు చేసింది. కానీ తాము జియోను మాత్రం అనుసరించమని, వారు ఇచ్చినట్లుగా అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందించే ఆలోచన తమకు లేదని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ స్పష్టం చేశారు.
Samayam Telugu airtel will not follow jio says no to free voice calls
జియోను మేం అనుసరించం: ఎయిర్‌టెల్

80 శాతానికి పైగా ఆదాయం వాయిస్ కాల్స్ నుంచే వస్తోందని, అందువల్ల ఆ సదుపాయాన్ని వినియోగదారులకు ఉచితంగా ఇవ్వలేమన్నారు. ఎక్కువ మంది వినియోగదారులు వాయిస్‌, డాటాలను విడివిడిగా ఉపయోగిస్తున్నారని, ఫీచర్ ఫోన్లు వాడే వినియోగదారులు డాటాను అసలు ఉపయోగించలేరన్నారు. ఇలాంటి వారికి ఎలాంటి టారిఫ్ కట్టకుండా ఉచిత కాల్స్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీన్ని ఎప్పటికీ ఉచితంగా ఇవ్వలేమన్నారు. మీరు మొత్తంగా చూస్తే ఒక సర్వీస్ ఉచితంగా ఇచ్చి, మరొక సర్వీస్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, అలా కాకుండా అన్నీ ఉచితంగా ఇస్తే ఆ కంపెనీని మూసేయాల్సిందే అన్నారు. ఎవరైతే మొబైల్ డాటాను ఉపయోగించరో వారికి వాయిస్ కాల్స్‌ను ఉచితంగా ఇవ్వడం సాధ్యపడదని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.