యాప్నగరం

నన్ను మోసగాడు అనొద్దు: విజయ్ మాల్యా

మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు, బ్యాంకులను ముంచేశారంటూ తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని విజయ్ మాల్యా కొట్టిపారేశారు. భారతీయ బ్యాంకులకు బకాయిపడ్డ రుణాలను చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు లండన్ కోర్టుకు తెలిపారు.

Samayam Telugu 31 Jul 2018, 5:49 pm
మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు, బ్యాంకులను ముంచేశారంటూ తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని విజయ్ మాల్యా కొట్టిపారేశారు. భారతీయ బ్యాంకులకు బకాయిపడ్డ రుణాలను చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు లండన్ కోర్టుకు తెలిపారు. తాను 2015 నుంచే రుణాలు చెల్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. తనను మోసగాడు అనొద్దని పరోక్షంగా మీడియాకు సంకేతాలు ఇచ్చారు. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంపై దాఖలైన పిటిషన్‌పై తుది వాదనలు వినిపించే నిమిత్తం మంగళవారం (జులై 31) లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు మాల్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
Samayam Telugu Vijay


భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే తాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాల్యా తెలిపారు. తన పేరిట ఉన్న రూ.14,000 కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానని చెప్పారు. కేసును పరిష్కరించాల్సిందిగా కోర్టును కోరినట్లు మాల్యా చెప్పారు.
Also Read: మాల్యాను ఉంచే ముంబై జైలు వీడియో ఇవ్వండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.