యాప్నగరం

August 15.. త్రివర్ణ కాంతులతో అంబానీ ఇల్లు.. విద్యుత్ కాంతులతో జిల్ జిగేల్

August 15.. స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ ప్రజలందరూ ఏకమై.. తమ ఇళ్లపై జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కూడా స్వాతంత్య్ర వేడుకలకు తమ ఇంటిని సర్వాంగ సుందరంగా.. విద్యుత్ కాంతులతో జిల్ జిగేల్‌మనిపించారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 15 Aug 2022, 4:42 pm

ప్రధానాంశాలు:

  • దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జెండా పండగ
  • ప్రతి ఇంటిపై రెపరెపలాడిన జాతీయ జెండా
  • విద్యుత్ కాంతులతో జిల్ జిగేల్‌మన్న యాంటిలియా
  • మనవడితో కలిసి సంతోషంగా వేడుకల్లో పాల్గొన్న అంబానీ దంపతులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ambani House
త్రివర్ణ కాంతులలో అంబానీ ఇల్లు
August 15.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ స్వాతంత్య్ర వేడుకలను తమ మనవడు పృథ్వీ అంబానీతో కలిసి జరుపుకున్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, కోడల్ శ్లోకా అంబానీల కొడుకే పృథ్వీ అంబానీ. పృథ్వీ 2020 డిసెంబర్ 10న ఆకాశ్, శ్లోకాలకు జన్మించాడు. మనవడితో కలిసి స్వాతంత్య్ర వేడుకలలో అంబానీ పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాక తన ఇంటిని కూడా త్రివర్ణ కాంతులతో, విద్యుత్ వెలుగుల్లో జిల్ జిగేల్‌మనిపించారు.


స్వాతంత్య్రోత్సవం సందర్భంగా ముకేశ్ అంబానీ తన ఇంటిని(యాంటిలియాను) కూడా త్రివర్ణ కాంతులతో సర్వాంగ సుందరంగా అలకరించారు. ఈ డెకరేషన్ చూపరులను ఆకట్టుకుంటోంది. ముకేశ్ అంబానీ హౌస్ యాంటిలియా డెకరేషన్‌ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. యాంటిలియా అంతా దేశభక్తితో పరిణమిల్లుతుందని పేర్కొంటున్నారు.



మరోవైపు దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి 75వ స్వాతంత్య్రాన్ని భారత్ పూర్తి చేసుకుంటూ ఉండటంతో.. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో.. ప్రతి ఇంటిపై జెండా ఎగిరింది. బిల్డింగ్‌లు, ప్రముఖ స్థలాలన్ని విద్యుత్ కాంతులతో జిల్ జిగేల్‌మంటున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసు, నేవి ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్, కంపెనీకి చెందిన 13 తయారీ సైట్లు, 1072 జియో సెంటర్లు, 6 వేలకు పైగా జియో పాయింట్లు, అన్ని రిలయన్స్ స్టోర్లు కూడా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నాయి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు.


Also Read :Ola First Electric Car: బిగ్ సర్‌ప్రైజ్ రివీల్ చేసిన ఓలా.. తొలి ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. ఖాది రంగులో.. !

Also Read : పంద్రాగస్టు రోజున బంగారం, వెండి ధరలు.. 1947 నుంచి బంగారం ధర ఏ రేంజ్‌లో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.