యాప్నగరం

Milk Price Hike: పాల రేట్లు పెంచిన కంపెనీలు.. లీటరు మిల్క్ ప్యాకెట్ ధరెంత..?

Milk Price Hike: పాల ధరలు పొంగుతున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతూ ఉండటంతో.. కంపెనీలు కూడా రేట్ల పెంపును చేపడుతున్నాయి. రేపటి నుంచి అమూల్ పాల ప్యాకెట్ ధరలను పెంచింది. అమూల్‌ బాటలోనే మదర్ డెయిరీ కూడా నడిచింది. మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెరిగాయి. ఈ రేట్ల పెంపును లీటరుపై రూ.2 మేర చేపట్టాయి. దీంతో ఈ కంపెనీలు విక్రయించే పాల ప్యాకెట్ల ధరలు రెండు రూపాయల మేర పెరగనున్నాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 16 Aug 2022, 4:18 pm

ప్రధానాంశాలు:

  • పాల ధరలు పెంచిన ప్రముఖ కంపెనీలు
  • అమూల్, మదర్ డెయిరీల ప్రకటన
  • రేపటి నుంచే లీటరుపై రూ.2 మేర పెంపు
  • అమూల్ గోల్డ్‌ ప్యాకెట్ ధర రూ.31
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amul and Mother Dairy hikes milk prices
అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు పెంపు
Milk Price Hike: దేశంలో అతిపెద్ద పాల విక్రయ సంస్థలైన అమూల్, మదర్ డెయిరీ రేపటి నుంచి పాల ధరలను పెంచుతున్నాయి. ఆగస్టు 17 నుంచి ధరలను పెంచుతున్నట్టు అమూల్ పాలను విక్రయించే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. అమూల్ బ్రాండ్ కింద విక్రయించే అన్ని రంగాల పాల ధరలు పెరుగుతాయని జీసీఎంఎంఎఫ్ మంగళవారం తెలిపింది. ఈ ధరల పెంపును 4 శాతం వరకు చేపట్టింది. అమూల్‌తో పాటు మదర్ డెయిరీ కూడా లీటరుపై రూ.2 మేర ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది.
జీసీఎంఎంఎఫ్ ప్రకారం.. అమూల్ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. దీంతో అమూల్ గోల్డ్‌కు చెందిన 500 ఎంఎల్ ప్యాకెట్ ధర రేపటి నుంచి రూ.31కి పెరుగుతుంది. అదేవిధంగా అమూల్ తాజా 500 ఎంఎల్ ప్యాకెట్ ధర రూ.25కు, అమూల్ శక్తి హాఫ్ లీటరు ప్యాకెట్ ధర రూ.28కు పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం ప్రకారం.. లీటరుపై రూ.2 పెంపు అనేది చాలా తక్కువని అమూల్ కంపెనీ జీసీఎంఎంఎఫ్ చెప్పింది. అమూల్ పాల ప్యాకెట్ ధరల పెంపు.. గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమబెంగాల్, ముంబై వంటి చాలా రాష్ట్రాలలో కనిపించనుంది.

Also read : గృహ, ఆటో రుణాల కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్ చెప్పిన బ్యాంకు.. నెలనెలా పెరనగున్న వాయిదాలు!

మదర్ డెయిరీ పాల ధరలు పెంపు..

అమూల్‌తో పాటు మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచింది. దీంతో ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరు రూ.59 నుంచి రూ.61కి పెరుగుతుంది. అలాగే టోన్డ్ మిల్క్ ధర రూ.51కి, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరు రూ.45కు ఎగియనున్నాయి. ఆవు పాల ధరలు లీటరు రూ.53కి పెరుగుతున్నాయి. టోకెన్ మిల్క్ ధర లీటరు రూ.46 నుంచి రూ.48కి పెరుగుతుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో.. కంపెనీ ధరలు పెంచిందని మదర్ డెయిరీ చెప్పింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్లో ప్రముఖ పాల సరఫరాదారిలో మదర్ డెయిరీ ఒకటి. ఇది రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తుంది. మార్చిలో కూడా మదర్ డెయిరీ పాల ధరను లీటరుపై రూ.2 పెంచింది.

Also Read : Bank Holidays: ఈ వారంలో కూడా బ్యాంకులకు సెలవులు, హైదరాబాద్‌లో హాలిడే ఎప్పుడంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.