యాప్నగరం

అంబానీ అలజడి: తమ్ముడి ఆస్తులు.. అన్నకు!

తన సోదరుడు అనిల్ ఆస్తులు ఇతరుల చేతికి వెళ్లనీయకుండా ముఖేష్... ఆర్‌కామ్‌కు సంబంధించిన వైర్‌లెస్ స్పెక్ట్రం, టవర్స్, ఫైబర్, మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCNS)లను కొనుగోలు చేశారు.

TNN 28 Dec 2017, 9:56 pm
తీవ్ర అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్ అంబానీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) అధినేత, ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. తన సోదరుడు అనిల్ ఆస్తులు ఇతరుల చేతికి వెళ్లనీయకుండా ముఖేష్... ఆర్‌కామ్‌కు సంబంధించిన వైర్‌లెస్ స్పెక్ట్రం, టవర్స్, ఫైబర్, మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCNS)లను కొనుగోలు చేశారు.
Samayam Telugu anil ambanis rcom to sell assets to mukeshs jio
అంబానీ అలజడి: తమ్ముడి ఆస్తులు.. అన్నకు!


ఆర్‌కాంకు చెందిన 4జీ స్పెక్ట్రం(122.4MHz), 43వేల టవర్లు, 1,78,000 రూట్ కిలోమీటర్ల ఫైబర్ లైన్లు కూడా ఇక జియో ఆధీనంలోనే ఉంటాయని రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఈ లావాదేవీలన్నీ 2018 మార్చిలోగా పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఆర్‌కాం ఆస్తులను కొనుగోలు చేసేందుకు జియోనే అత్యధిక బిడ్‌లను దాఖలు చేయడం గమనార్హం. అక్టోబరు నెలకే ఆర్‌కామ్‌కు దాదాపు రూ.45 కోట్ల రుణభారం ఉంది. దీంతో, ఆ భారాన్ని రూ.6 వేల కోట్లు పరిమితం చేసే లక్ష్యంతో స్ట్రేటజిక్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్ (SDR) కింద ఆస్తులను విక్రయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.