యాప్నగరం

రూ.2వేల కోట్ల విలువ చేసే అమ‌రావ‌తి బాండ్ల రిలీజ్

అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది.

Samayam Telugu 14 Aug 2018, 1:21 pm
నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాండ్లు ఇన్వెస్ట‌ర్ల‌కు అందుబాటులో వ‌చ్చాయి. అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది. మ‌న దేశంలో ఓ రాజధాని నిర్మాణం కోసం బాండ్లు రిలీజ్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ బాండ్లు రూ.10 లక్షల ముఖ విలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో భాగంగా రూ.1,300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్‌డీఏ విడుదల చేసింది.
Samayam Telugu రాజ‌ధాని నిర్మాణం కోసం బాండ్లు


బీఎస్‌ఈలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. వీటిపై మదుపర్లు ఆసక్తి చూపడంతో త్వరగానే అమ్ముడుపోయాయి. మధ్యహ్నం 12 గంటల తర్వాత మరిన్ని బాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. బాండ్ల విక్రయాలను సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సహా ఉన్నతాధికారులు కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.