యాప్నగరం

భారత్‌లో కార్డు పేమెంట్లు నిలిపివేత.. దిగ్గజ కంపెనీ ప్రకటన.. కస్టమర్లకు ఎదురుదెబ్బే

డెబిట్, క్రెడిట్ కార్డుల పేమెంట్లలో మార్పులు వస్తున్నాయి. వినియోగదారుల సంరక్షణార్థం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త రూల్స్‌ను తీసుకొస్తోంది. జూన్ 30 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ రూల్స్ ప్రకారం కస్టమర్ల కార్డుల సమాచారాన్ని మర్చెంట్లు స్టోర్ చేయడానికి వీలుండదు. కస్టమర్ల కార్డులకు సంబంధించిన డేటా ఏదైనా స్టోర్ చేసి ఉంటే వెంటనే వాటిని మర్చెంట్లు తొలగించాలి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తోన్న సమయంలో.. ఆపిల్ తన కస్టమర్లకు ఝలకిచ్చింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 19 May 2022, 8:01 pm

ప్రధానాంశాలు:

  • కార్డు పేమెంట్లను నిలిపివేసిన ఆపిల్
  • డెడ్‌లైన్ కంటే ముందే ఈ నిర్ణయం
  • జూన్ 30 నుంచి అమల్లోకి ఆర్‌బీఐ రూల్స్
  • కార్డు టోకెనైజేషన్ తెస్తోన్న సంస్థలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Apple Card Payments
కార్డు పేమెంట్లను నిలిపివేస్తున్నట్టు ఆపిల్ ప్రకటన
Apple Card Payments : ఆపిల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లకు భారీ ఎదురు దెబ్బ. భారత్‌లో తన ప్లాట్‌ఫామ్స్‌పై డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేస్తున్నట్టు ఆపిల్ ప్రకటించింది. జూన్ 30 కల్లా మర్చెంట్లందరూ కస్టమర్ల కార్డు డేటాను సేవ్ చేయడం ఆపివేయాలని, సేవ్ చేసిన డేటానంతా డిలీట్ చేయాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డెడ్‌లైన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ తుది గడువు కంటే ముందే Apple ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు ప్రస్తుతం నెట్‌బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ), ఆపిల్ ఐడీ బ్యాలెన్స్‌ను వాడుకుని మాత్రమే పేమెంట్లు చేసుకునేందుకు వీలవుతుందని ఆపిల్ ఈమెయిల్ ద్వారా కస్టమర్లకు తెలియజేసింది.
‘‘రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా, జూన్ 1 నుంచి ఆపిల్ స్టోర్, ఇతర ఆపిల్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులను వాడుకోవడానికి వీలులేదు. ఆపిల్ కార్డుల సమాచారాన్ని స్టోర్ చేయదు. మీ పేమెంట్ విధానాన్ని సంరక్షించడమే మా ప్రధాన కర్తవ్యం’’అని ఈమెయిల్‌లో ఆపిల్ తెలిపింది. ఆపిల్ వాలెట్లలో సరిపోయేంత బ్యాలెన్స్ ఉంటేనే కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుందని పేర్కొంది.

మీరు ఒకవేళ ఆపిల్ మ్యూజిక్, టీవీ ప్లస్, ఐక్లౌడ్ ప్లస్ లేదా థర్డ్ పార్టీ సబ్‌స్క్రయిబర్ అయి ఉండి.. మీరు ఇంకా మీ సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యూ చేసుకుని ఉండకపోతే.. మీ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అయిపోతుందని ఆపిల్ తెలిపింది. కస్టమర్ల సేఫ్టీ, పెరుగుతోన్న మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ పేమెంట్ అగ్రిగేటర్లకు, పేమెంట్ గేట్‌వేలకు, మర్చంట్లకు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలలో కస్టమర్ల కార్డులకు చెందిన సమాచారాన్ని వీరు స్టోర్ చేయడానికి వీలు ఉండదు. జూన్ 30 నుంచి మర్చెంట్లందరూ ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. కార్డు వివరాలను స్టోర్ చేయడానికి వీలు లేకపోతుండటంతో.. వీసా, మాస్టర్ కార్డు, రూపేతో పాటు బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, పేమెంట్ అగ్రిగేటర్లు కార్డు టోకెనైజేషన్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నాయి. కార్డు వాడే ప్రతి దగ్గర ఈ టోకెన్ సిస్టమ్‌ను అమల్లోకి తెస్తున్నాయి.

Also Read : Pakistani Rupee : భారీగా కుప్పకూలిన కరెన్సీ.. ట్రేడర్లకు బ్లాక్ డే!

Also Read : Palm Oil : హమ్మయ్య.. నిషేధం ఎత్తివేత.. ఎట్టకేలకు దిగిరానున్న ఆయిల్ ధరలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.