యాప్నగరం

మోదీకి షాకిచ్చిన జైట్లీ.. కారణమిదే!

కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేనని జైట్లీ లేఖలో తెలిపారు. ఆరోగ్య సమస్యలను ఇందుకు కారణంగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని కోరుకున్నారు.

Samayam Telugu 29 May 2019, 2:54 pm

ప్రధానాంశాలు:

  • కొత్త ప్రభుత్వంలో కొనసాగలేనని ప్రధాన మోదీకి లేఖ
  • ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని విజ్ఞప్తి
  • ఆరోగ్య సమస్యలను కారణంగా పేర్కొన్న జైట్లీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu JAITLEY
ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ప్రధాని మోదీకి.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెద్ద షాకిచ్చారు. కొత్తగా ఏర్పాటుకానున్న కేబినెట్‌లో స్థానం వద్దని కోరుతూ మోదీకి లేఖ రాశారు. మోదీ మే 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేనని జైట్లీ లేఖలో తెలిపారు. ఆరోగ్య సమస్యలను ఇందుకు కారణంగా పేర్కొన్నారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని కోరుకున్నారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోయే వరకు సమయమివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే ఆరుణ్ జైట్లీ ఆరోగ్యం సరిగా లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్‌ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయినప్పటికీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.