దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకు ఎట్టకేలకు ఆర్బీఐ నిర్ణయంపై రెండు వారాల తర్వాత స్పందించింది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు నేటి(మే 18,2022) నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకు ఎంసీఎల్ఆర్ పెంచడంతో.. ఈ బ్యాంకు నుంచి తీసుకునే అన్ని రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కాగా, ఈ నెల 4వ తేదీన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సడెన్గా వడ్డీ రేటు రెపోను 40 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. సీఆర్ఆర్(క్యాష్ రిజర్వు రేషియో)ను కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ప్రకటన వచ్చి రెండు వారాలైంది. ఈ రెండు వారాలలో చాలా చిన్న, పెద్ద బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్ల పెంపును ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు వడ్డీ రేట్లు పెంచకుండా ఉన్న ఒకే ఒక్క బ్యాంకుగా యాక్సిస్ నిలిచింది. కానీ రెండు వారాల తర్వాత మాత్రం బ్యాంకు లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఈ బ్యాంకు కూడా ప్రకటించింది. ఆటో, హోమ్, పర్సనల్ లోన్ల వంటి అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్ఆర్ అంటే వడ్డీ రేటు 35 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని బ్యాంకు ప్రకటించింది. ఈ రేట్ల పెంపు తర్వాత కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే కాక, పాత కస్టమర్లు కూడా ముందటి కంటే ఎక్కువ ఈఎంఐలను చెల్లించాలని బ్యాంకు పేర్కొంది. ఈ పెంపు తర్వాత, ఒక రాత్రి నుంచి నెల వ్యవధి గల లోన్ల ఎంసీఎల్ఆర్ 7.55 శాతానికి పెరిగింది. అంతకుముందు ఈ రేటు 7.2 శాతంగా ఉండేది. అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.65 శాతానికి ఎగిసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.7 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.75 శాతానికి పెరిగాయి. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.5 శాతం నుంచి 7.85 శాతానికి జంప్ చేసింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.9 శాతానికి ఎగిసింది.
ఎంసీఎల్ఆర్ అంటే..
2016లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా లెండింగ్ రూల్స్ను మార్చింది. ఈ రూల్స్ ప్రకారం బ్యాంకులు బేస్ రేటుపై కాకుండా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటుపై లోన్లను జారీ చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ను నిర్ణయించడంలో ఫండ్స్ మార్జినల్ కాస్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
Also read : ఎయిర్ టెల్ నెట్వర్క్ వాడే వారికి బ్యాడ్న్యూస్.. మరో టారిఫ్ పెంపుకు సంకేతాలిచ్చిన సీఈవో
Also read : చౌక ధరల విమానయానం ఇండిగోకి కొత్త సీఈవో.. ఆయన ఎవరంటే..?
ఎంసీఎల్ఆర్ అంటే..
2016లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా లెండింగ్ రూల్స్ను మార్చింది. ఈ రూల్స్ ప్రకారం బ్యాంకులు బేస్ రేటుపై కాకుండా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటుపై లోన్లను జారీ చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ను నిర్ణయించడంలో ఫండ్స్ మార్జినల్ కాస్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
Also read : ఎయిర్ టెల్ నెట్వర్క్ వాడే వారికి బ్యాడ్న్యూస్.. మరో టారిఫ్ పెంపుకు సంకేతాలిచ్చిన సీఈవో
Also read : చౌక ధరల విమానయానం ఇండిగోకి కొత్త సీఈవో.. ఆయన ఎవరంటే..?