యాప్నగరం

ఫ్రీచార్జ్‌ను కొనుగోలుచేసిన యాక్సిస్ బ్యాంక్

ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌కు చెందిన మొబైల్ పేమెంట్స్ వాలెట్ ఫ్రీచార్జ్‌ను ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది.

TNN 27 Jul 2017, 4:47 pm
ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌కు చెందిన మొబైల్ పేమెంట్స్ వాలెట్ ఫ్రీచార్జ్‌ను ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. స్నాప్‌డీల్‌ మాతృ సంస్థ జాస్పర్స్‌ ఇన్ఫోటెక్‌‌ నుంచి రూ. 385 కోట్లకు (60.04 మిలియన్ డాలర్లు) ఫ్రీచార్జ్‌ను సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే యాక్సిస్ బ్యాంక్ చెల్లించనుంది. 2015 ఏప్రిల్‌లో ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్‌ 400 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 2,500 కోట్లు) కొనుగోలు చేసింది. అప్పట్లో దేశీ స్టార్టప్‌ సంస్థలకు సంబంధించి ఇది అతిపెద్ద డీల్‌గా నిలిచింది.
Samayam Telugu axis bank to buy freecharge from snapdeal for rs 385 crore
ఫ్రీచార్జ్‌ను కొనుగోలుచేసిన యాక్సిస్ బ్యాంక్


అప్పట్లో స్నాప్‌డీల్ కొనుగోలు చేసిన మొత్తం కన్నా ఇప్పుడు యాక్సిస్‌ బ్యాంక్‌ కొంటున్న మొత్తం చాలా తక్కువే. స్నాప్‌డీల్‌ చేతికి చేరకముందు ఫ్రీచార్జ్‌ సంస్థ 11.6 కోట్ల డాలర్లను సమీకరించింది. అయితే తాజా డీల్‌తో నగదు కొరతతో సతమతమవుతున్న స్నాప్‌డీల్‌కు ఊరట లభించనుంది. ఇప్పటికే ఫ్రీచార్జ్‌లో పనిచేస్తున్న పాత ఉద్యోగుల్లో దాదాపు 250 మంది కొత్త యాజమాన్యం కింద కొనసాగనున్నారు. ఒక డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీని ఒక బ్యాంకు కొనుగోలు చేయడం భారత్‌లో ఇదే ప్రథమం. ఫ్రీచార్జ్‌ కొనుగోలుతో దానికి ఉన్న 5 కోట్ల మంది మొబైల్‌ వాలెట్‌ యూజర్లు.. యాక్సిస్‌ బ్యాంకుకు చేరువకానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.