యాప్నగరం

దేశంలోనే అత్యంత ఖరీదైన Pent House.. విలువ వందల కోట్లు.. వార్నీ ఇంత డిమాండ్ దేనికి?

Bajaj Auto: బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌ హౌస్‌ను కొన్నారు. ముంబయి మలబార్ హిల్ ప్రాంతంలో ఈ మూడంతస్తుల పెంట్ హౌస్‌ కొనుగోలు చేశారు. ఇక దీని విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వందల కోట్లతో కొనడం విశేషం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 17 Mar 2023, 10:24 pm
Bajaj Auto: దిగ్గజ వ్యాపారవేత్త, Bajaj Auto ఛైర్మన్ నీరజ్ బజాజ్, ముంబయి మలబార్ హిల్ (Malabar Hill) ప్రాంతంలో ట్రిప్లెక్స్ (మూడంతస్తులు) ఇల్లు కొనుగోలు చేసినట్లు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి. ఇక దీని విలువ రూ.252.5 కోట్లు కావడం గమనార్హం. ఇది సీ సైడ్ ఇల్లు కావడం వల్ల అంత డిమాండ్ ఉన్నట్లు తెలిసింది. ఇక మొత్తం 18,008 చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఇది విస్తరించి ఉంది. ఈ ట్రిప్లెక్స్ ఇంటిని లోధా గ్రూప్ (మ్యాక్రోటెక్ డెవలపర్స్) నుంచి కొనుగోలు చేశారు బజాజ్. ఇక భారతదేశంలోనే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ డీల్స్‌లో అతిపెద్ద వాటిల్లో ఇది ఒకటని చెబుతున్నారు. మొత్తం 31 అంతస్తులుగా నిర్మిస్తున్న లోధా మలబార్ ప్యాలెసెస్‌లో .. 29,30,31 అంతస్తుల్లో అంటే పెంట్ హౌస్‌ను నీరజ్ బజాజ్ (Niraj Bajaj) బుక్ చేసుకున్నట్లు తెలిసింది. ఇక ఈ మూడంతస్తుల ఇల్లులో 8 కార్లను పార్కింగ్ చేసుకునేందుకు వీలుంటుంది.
Samayam Telugu malabar hills penthouse bajaj auto


ఈ అత్యంత ఖరీదైన భవనానికి స్టాంప్ డ్యూటీగానే రూ.15.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2026 జూన్ నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో ప్రైవేట్ రూఫ్‌టాప్ టెర్రస్, స్విమ్మింగ్ పూల్ కూడా అందుబాటులో ఉంటుందంట.

గత నెలలో వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ (Welspun Group) బీకే గోయెంకా రూ.230 కోట్లతో పెంట్ హౌస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ సన్నిహితులు కూడా రూ.1238 కోట్ల విలువైన 28 ఇళ్లను కొనుగోలు చేశారు. ఇక రూ.10 కోట్లకు మించిన మూలధన లాభాలను పెట్టుబడిగా పెట్టినట్లయితే ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పరిమితి లేనందునే ఇలా విలాసవంత ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

DLF రికార్డు స్థాయిలో Flats అమ్మకాలు.. కట్టకముందే మూడే మూడు రోజుల్లో రూ.8 వేల కోట్ల సేల్స్.. ఒక్కో ఫ్లాట్ ధర తెలిస్తే.. Hyderabad చుట్టుపక్కల Plots ఏమైనా కొంటున్నారా? ఇలాంటి మోసాలు చేస్తున్నారు జాగ్రత్త..

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.