యాప్నగరం

Minimum Balance: బ్యాంకు అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఇక అవసరం లేదా? కేంద్రం ఏం చెప్పింది?

Minimum Balance: ఈ రోజుల్లో 18 ఏళ్లు పైబడిన దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అయితే కొందరికి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. వారి అవసరాల నిమిత్తం ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. అయితే.. మనం వాడకపోయినా వాటిల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పడు మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ డిపాజిట్లు ఉంటే వారిపై ఏమైనా ఫైన్ విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందా? అసలీ నిబంధనను తీసేయనుందా?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 25 Nov 2022, 11:16 am
Minimum Balance: ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు అందులో మినిమం బ్యాలెన్స్ (కనీస మొత్తంలో నగదు) మెయింటెయిన్ చేయకపోతే మనకు జరిమానాలు, అదనపు ఛార్జీలు పడుతుంటాయి. అయితే.. భవిష్యత్తులో అంతా సవ్యంగా సాగితే.. ఇకపై బ్యాంక్ అకౌంట్‌లో ఇక మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాల్సిన పనిలేదట. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్‌వత్ కిషన్‌రావ్ కారడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకు అకౌంట్ మినిమం బ్యాలెన్స్ గురించి ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.
Samayam Telugu Bank account minimum balance


అది బ్యాంకు బోర్డుల పని..

బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిల్ చేయడం రద్దు చేసే అధికారం.. బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంటుందని అన్నారు భగ్‌వత్. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన బుధవారం రోజు శ్రీనగర్‌లో ఇలా వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఇండిపెండెంట్ బాడీలని, ఫైన్‌లు విధించకుండా చూసుకునే బాధ్యత వారిపైనే ఉంటుందని అన్నారు.

బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తంలో నగదు మెయింటెయిన్ వారిపై పెనాల్టీ విధించాలని బ్యాంకులకు కేంద్రం ఏమైనా సూచలను చేస్తుందా? అని మంత్రిని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. పెనాల్టీలు విధించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కేంద్ర మంత్రి ప్రస్తుతం వివిధ ఆర్థిక పథకాలను జమ్ముకశ్మీర్ ప్రజలకు చేరువ చేసే చర్యల్లో భాగంగా అక్కడ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంత్రి జమ్ముకశ్మీర్ వెళ్లారు.


మినిమం బ్యాలెన్స్ ఏంటి?

కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్ కోసం.. బ్యాంకులు ఎన్నో ఫెసిలిటీస్ అందిస్తుంటాయి. అయితే ఇదే క్రమంలో వారు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలంటే కొన్ని రూల్స్ పాటించడం తప్పనిసరి కదా. అందులో భాగంగా.. వారి బ్యాంకు ఖాతాలో కనీస మొత్తం నగదు నిల్వ ఉంచుకోవాలని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అప్పుడు వారి ఖాతా యాక్టివ్‌లో ఉందా లేదా అనేది తెలుస్తోంది. కనీస నగదు మెయింటెయిన్ చేయకపోతే మాత్రం జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పట్లో చాలా వరకు బ్యాంక్ ఖాతాలు చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. అంటే వారు ఉద్యోగం మారిన సమయంలోనో, లేదా లోన్ల కోసం ప్రయత్నించే సందర్భాల్లో ఇతర అకౌంట్లను తీసుకుంటుంటారు. కానీ ఒక్కసారి ఉపయోగించుకున్న తర్వాత మళ్లీ వాటిని వాడటం లేదు. అందుకే అవి డొర్మెంట్ అకౌంట్లుగా మారిపోతున్నాయి. అంటే నిరుపయోగంగా మిగులుతున్నాయి. అందుకోసమే ఇలాంటివి పెరిగిపోకుండా అందరూ బ్యాంక్ అకౌంట్లను సక్రమంగా వినియోగించేలా ఇలాంటి రూల్స్ పెడుతుంటాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఇలాంటి నిరుపయోగ బ్యాంక్ ఖాతాలు పెరుగుతూనే ఉన్నాయి. వారేం చేస్తారు తమ అవసరాల కోసం ఎక్కువ అకౌంట్లను తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే సమస్య ఉంటుందా? ఉండదా అని?



20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: టాప్-10 ఇండియన్ కంపెనీలివే.. అంబానీ, అదానీల్లో ఎవరిది పైచేయి.. ఆ దేశాల జీడీపీని మించి..!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.