యాప్నగరం

బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ!

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. లేదంటే మోసపోవాల్సి రావొచ్చు. ఒక చిన్న తప్పుతో బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావొచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

Samayam Telugu 5 May 2021, 6:05 am
ఆన్‌లైన్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో బ్యాంకులు కూడా వాటి కస్టమర్లను అలర్ట్ చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI కూడా ఇప్పుడు వీటి జాబితాలోకి చేరింది. తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది.
Samayam Telugu bank account


బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంక్ కస్టమర్లు వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వెల్లడించొద్దని తెలిపింది. మొబైల్ నెంబర్ వివరాలను కూడా తెలియజేయవద్దని కోరింది. కస్టమర్లు ఒకవేళ ఈ వివరాలను వెల్లడిస్తే.. మోసపోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Also Read: undefined


Also Read: undefined

సోషల్ ఇంజినీరింగ్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎందుకంటే మోసగాళ్లు బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లను పోలిన నెంబర్లతో కాల్ చేసి బ్యాంక్ కస్టమర్లను మోసం చేస్తున్నారు. అలాగే ఫోన్ కాల్ లేదా ఇతర మార్గాల్లో పిన్ నెంబర్, సీవీవీ, ఓటీపీ, కార్డు వివరాలను ఎవ్వరీకి తెలియజేయవద్దని బ్యాంక్ కోరింది. ఇది కేవలం ఏ ఒక్క బ్యాంక్‌ కస్టమర్లకు కాకుండా అన్ని బ్యాంకుల ఖాతాదారులకు వర్తిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.