Bank Customers Alert! State Bank Of India Says Update Kyc Or Bank May Freeze Your Accounts, Check Details
SBI కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీ అకౌంట్ పనిచేయదు!
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉందా? సేవింగ్స్ ఖాతా మాత్రమే కాకుండా ఇతర అకౌంట్లు కలిగి ఉన్నారా? అయితే మీకు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలేలి. లేదంటే సమస్య ఎదుర్కోవలసి రావొచ్చు.
Samayam Telugu3 Feb 2020, 5:39 am
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉందా? సేవింగ్స్ ఖాతా మాత్రమే కాకుండా ఇతర అకౌంట్లు కలిగి ఉన్నారా? అయితే మీకు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలేలి. లేదంటే సమస్య ఎదుర్కోవలసి రావొచ్చు.
ఎస్బీఐ అలర్ట్
బ్యాంక్ కస్టమర్లు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుసుకోవాలని స్టేట్ బ్యాంక్ తెలిపింది. దీనికి సంబంధించి పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేసింది. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని బ్యాంకింగ్ సర్వీసులును ఎలాంటి ఆటంకం లేకుండా పొందాలని సూచించింది.
నాన్ కేవైసీ బ్యాంక్ అకౌంట్లు పనిచేయకపోవచ్చని, స్తంభింపజేస్తామని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అందువల్ల మీరు మీ అకౌంట్కు పూర్తి కేవైసీ కలిగి ఉన్నట్లయితే ఇబ్బందులు ఉండవు. లేదంటే వెంటనే కేవైసీని పూర్తి చేసుకోండి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు కస్టమర్ల కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తూ రావాలి. బ్యాంకులు క్రమానుగతంగా అప్పుడప్పుడు కస్టమర్ల కేవైసీ వివరాలు అప్డేట్ చేయాల్సిందే. ఒకవేళ కస్టమర్ల కేవైసీ పెండింగ్లో ఉంటే.. అప్పుడు వారికి అలర్ట్ పంపాలి.
బ్యాంక్ నుంచి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని అలర్ట్ పొందిన వారు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం మంచిది. దగ్గరిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు వెళ్లి కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్లు అవసరం కావొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లకు గడువు నిర్దేశించింది. ఫిబ్రవరి 28లోగా అవసరమైన డాక్యుమెంట్లు అందజేసి కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి బ్యాంక్ తెలిపింది.
స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు కేవైసీ అప్డేట్కు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా పంపుతోంది. నిర్దేశిత గడువులోగా కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. మీకు కూడా ఇలాంటి ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చి ఉంటే వెంటనే పని పూర్తి చేసుకోండి.
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) జారీ చేసే లెటర్స్ కూడా కేవైసీ (నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్గా పని చేస్తుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అందువల్ల ఖాతాదారులు ఎన్పీఆర్ డాక్యుమెంట్ బ్యాంక్కు ఇవ్వొచ్చు.
ఇటీవల కాలంలో బ్యాంకులు తమ కస్టమర్ల కేవైసీ అప్డేట్కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంకులు కస్టమర్ కేవైసీ నిబంధనలు అతిక్రమిస్తే ఆర్బీఐ వీటికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది.
ఖాతాదారులు బ్యాంక్కు వెళ్లి పాస్పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డు, ఎన్పీఆర్ లెటర్ వంటి వాటిల్లో ఏ డాక్యుమెంట ఇచ్చినా కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ ఫోట్ కూడా అవసరం పడొచ్చు.
అన్ని వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు కూడా కేవేసీ అప్డేట్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వాటి కస్టమర్లకు కూడా ఆర్బీఐ కేవైసీ రూల్స్ వర్తిస్తాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.