యాప్నగరం

Bank of Maharashtra: హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన దిగ్గజ బ్యాంక్.. రేపటి నుంచే నిర్ణయం అమల్లోకి..

Bank of Maharashtra: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు ఒకటి కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం అన్ని రకాల రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతుంటే.. ఈ బ్యాంక్ తగ్గించడం విశేషం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 12 Mar 2023, 4:27 pm
Bank of Maharashtra: హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM). ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేటు 8.6 శాతం ఉండగా.. దానిని ఇప్పుడు 8.4 శాతానికి తగ్గించింది. 2023, మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం హోం లోన్లపై 8.4 శాతం వడ్డీ రేటు అనేది బ్యాంకింగ్ సెక్టార్లలో అత్యంత తక్కువ వడ్డీ రేట్లలో ఒకటి. దీనినే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అందిస్తోంది. ఇదే సమయంలో రక్షణ సిబ్బంది, ఇతర పారామిలిటరీ బలగాలకు చెందిన వారికి ప్రత్యేక వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇది వేతన జీవులకు, ఇతర పెన్షనర్ కేటగిరీలకు ప్రయోజనం చేకూరుస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Samayam Telugu bank of maharashtra


ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇటీవల పండగ సందర్భంగా ఒక గుడ్‌న్యూస్ చెప్పడం గమనార్హం. బంగారం, గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు చెప్పింది. దీంతో కస్టమర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత వారం ప్రభుత్వ రంగానికే చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఆ బ్యాంక్.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి.. 8.5 శాతానికి చేర్చింది. ఇక MSME లోన్ ఇంట్రెస్ట్ రేటును కూడా ఈ బ్యాంకు తగ్గించి.. 8.4 శాతానికి చేర్చింది. ఇవి మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక ఇది పరిమిత ఆఫర్ అని, మార్చి 31 లాస్ట్ డేట్ అని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది.

SVB Collapse: US Bank దివాలా.. భారత దిగ్గజ బ్యాంకుపై పెను ప్రభావం.. కస్టమర్లలో వణుకు.. అన్నింటికీ అదే కారణం! Tata Play Binge: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, Sony Liv, Zee5 సహా 18 ఓటీటీలు.. కేవలం రూ.199కే.. ఆఫర్ అదిరింది!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.