అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఈ నెల 21న(శుక్రవారం) బ్యాంకు అధికారులు ఒక రోజు సమ్మె చేయనున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ప్రధాన కార్యదర్శి సి.సూర్యకుమార్, ఏఐబీఓసీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కార్యదర్శి జి.సుబ్రమణ్యం, ఆంధ్రాబ్యాంక్ అధికారుల సంఘం కార్యదర్శి ఎన్.వి.సత్యనారాయణ, ఏఐబీఓసీ డిప్యూటీ కార్యదర్శి బి.సుక్కయ్య, అలహాబాద్ బ్యాంక్ అధికారుల సంఘం కార్యదర్శి పి.ఆనంద్రావు, బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల సంఘం ఉపాధ్యక్షులు జి.నగేష్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల సంఘం కార్యదర్శి మల్లిఖార్జున్ ప్రకటించారు. బ్యాంకు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వేతన సవరణల్లో అన్ని తరగతుల అధికారులకు ఒకే విధమైన సవరణ ఉండేదని, 11వ వేతన సవరణలో అధికారుల పనితీరును బట్టి కాకుండా, బ్యాంకుల పనితీరును బట్టి సవరణ చేయాలన్న యాజమాన్యాల మొండి వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న జూనియర్ ఆఫీసర్లకు కనీస మూల వేతనం రూ.60 వేలు ఉండగా బ్యాంకు అధికారులకు అందులో మూడో వంతు కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Bank Strike: రేపు బ్యాంకు అధికారుల సమ్మె
11వ వేతన సవరణలో అధికారుల పనితీరును బట్టి కాకుండా, బ్యాంకుల పనితీరును బట్టి సవరణ చేయాలన్న యాజమాన్యాల మొండి వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu 20 Dec 2018, 12:57 pm
ప్రధానాంశాలు:
- బ్యాంకుల మొండి వైఖరిగా ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు.
- బ్యాంకు యాజమాన్యాలు మొండి వైఖరి విడనాడాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
- అధికారుల పనితీరును బట్టే వేతన సవరణ చేయాలని డిమాండ్