యాప్నగరం

Bank Privatisation: ఆ బ్యాంకును అమ్మేస్తున్న ప్రభుత్వం.. ఫుల్ స్వింగ్‌లో సన్నాహాలు.. పూర్తి వివరాలివే..!

Bank Privatisation: ఇటీవలి కాలంలో ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను కూడా చేపట్టింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రభుత్వ బ్యాంక్.. ప్రైవేటు పరమయ్యే అవకాశం ఉంది. దీని కోసం ఇప్పటికే బిడ్లు దాఖలయ్యాయి. అయితే బిడ్డర్ల పేర్లు మాత్రం ఇంకా వెల్లడించలేదు కేంద్రం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 10 Jan 2023, 6:17 pm
Bank Privatisation: ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) ప్రైవేటీకరణ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కాస్త ఆలస్యమైంది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడింది. 2023 ఏప్రిల్- 2024 మార్చిలోగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ ప్రైవేటు పరం కానుంది. ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (DIPAM).. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంతా పాండే సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం సహా LICకి ఉన్న వాటాలను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. వీటి కోసం ప్రాథమిక బిడ్లను కూడా ఎప్పుడో ఆహ్వానించింది కేంద్రం. బిడ్లు దాఖలైనా ఆ పేర్లను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.
Samayam Telugu bank privatisation


ఐడీబీఐ బ్యాంక్ కోసం దాఖలైన బిడ్డర్ల వివరాలను ఇప్పుడే వెల్లడించబోమని తుహిన్ పాండే స్పష్టం చేశారు. తదుపరి వర్చువల్ డేటా రూమ్‌కు యాక్సెస్ ఇవ్వడంతో పాటు.. క్వెరీస్‌ను పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక దాఖలు కాగా.. దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని నుంచి కేంద్రం ఎంపిక చేస్తుంది. ఆర్థిక బిడ్లు దాఖలైన తర్వాత.. రిజర్వ్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు.

పర్సనల్ లోన్ అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సినవి ఇవే..

కేంద్రం, LIC కలిపి ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో సుమారు 60.72 శాతం వాటాలను అమ్మకానికి పెట్టింది. అక్టోబర్‌లోనే పొటెన్షియల్ బయ్యర్స్‌ను బిడ్స్ వేసేందుకు ఆహ్వానించింది. డిసెంబర్ 16ను బిడ్లు దాఖలు చేసేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించింది. తర్వాత దానిని జనవరి 7 వరకు పొడిగించింది.

రెండు సార్లు చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అదానీ.. సక్సెస్‌కు కారణమదే అంటూ..!

అయితే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం, LIC కి కలిపి ఐడీబీఐ బ్యాంకులో 94.71 శాతం వాటా ఉంది. సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌కు పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నుంచి 5.28 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వ బ్యాంక్‌లో వాటా కొనుగోలు కోసం బిడ్డర్ల కనీస నికర సంపద రూ.22,500 కోట్లగా నిర్ణయించింది. ఇంకా గడిచిన ఐదేళ్లలో మూడు సంవత్సరాలు లాభాల్లో ఉండాలని చెప్పింది. ఈ నిబంధనల ప్రకారమే.. బిడ్డర్లను ఆమోదిస్తారు. తదుపరి ఆర్థిక బిడ్లను దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

Savings Account: సేవింగ్స్‌ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ ఇస్తాయట.. ఎలా లెక్కిస్తాయి.. మీకెంత వస్తోంది?


20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: గ్యాస్ సిలిండర్ రూ.10000.. గోధుమ పిండి రూ.2800.. రోటీల కోసం తొక్కిసలాట.. అక్కడ పరిస్థితులు

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.