యాప్నగరం

Mudra Yojana: 41 కోట్ల మందికి రూ.23.2 లక్షల కోట్ల రుణాలు మంజూరు.. PM ముద్ర పథకంలో ఎలా అప్లై చేసుకోవాలంటే?

Mudra Yojana: ప్రధాన మంత్రి ముద్ర యోజనకు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో ఈ పీఎం ముద్ర పథకం కింద ఇప్పటివరకు రూ.23.2 లక్షల కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సంబంధిత గణాంకాలను విడుదల చేసింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 8 Apr 2023, 2:57 pm
Mudra Yojana: చిన్న వ్యాపారులు, చిన్నతరహా, సూక్ష్మ సంస్థలకు లోన్లు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం ముద్ర యోజన (Pradhan Mantri MUDRA Yojana). ఇక ఈ పథకం 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైంది. నేటికి సరిగ్గా 8 ఏళ్లు పూర్తయిందన్నమాట. దీంతో పీఎం ముద్ర పథకం లబ్ధిదారులు.. ఎంత రుణాలు ఇచ్చాయి.. అనే గణాంకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.23.2 లక్షల కోట్లను మంజూరు చేసినట్లు తెలిపింది. ఈ 8 ఏళ్ల కాలంలో 40.82 కోట్ల మంది ప్రధాన మంత్రి ముద్ర పథకం కింద లబ్ధి పొందినట్లు పేర్కొంది. పీఎం ముద్ర పథకంలో భాగంగా.. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వారికి, వ్యాపార విస్తరణకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు.. రూ. 10 లక్షల వరకు తనఖాలేని రుణాలు అందిస్తుంది.
Samayam Telugu PM Mudra yojana


ఈ పథకం ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. 2023 మార్చి 24 నాటికి ఈ స్కీం కింద రూ.23.2 లక్షల కోట్ల మొత్తం రుణాల్ని .. 40.82 కోట్ల మంది ఖాతాలకు అందించినట్లు స్పష్టం చేశారు. పథకం కింద లబ్ధి పొందిన వారిలో 68 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలో ఉన్నట్లు చెప్పారు నిర్మలమ్మ. మొత్తం లోన్లు పొందిన వారిలో SC/ST, OBC కేటగిరీకి చెందిన వారు 51 శాతం మంది అని వివరించారు. ఇక భారత్‌లో తయారీకి MSMEలు ఊతమిస్తున్నాయని, వాటి ఏర్పాటుకు ముద్ర పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు నిర్మలా సీతారామన్. ఈ స్కీంతో క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని చెప్పారు.

Vodafone Idea: ఈ సిమ్ వాడుతున్నారా? అదిరిపోయే శుభవార్త.. రూ. 181కే అద్భుత ఆఫర్.. త్వరపడండి! IT Hiring: కష్టకాలం మొదలైంది.. ఐటీ కంపెనీలు అలా చేస్తున్నాయేంటి? మరో 6 నెలలు కష్టమేనట..

పీఎం ముద్ర యోజన కింద మొత్తం 3 రకాల రుణాలుంటాయి. శిశు రుణాల కింద రూ.50 వేల వరకు, కిశోర్ లోన్ల కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు ఆర్థిక చేయూత అందిస్తుంది కేంద్రం. లబ్ధిదారులు ఎవరైనా.. మూలధనంలో 10 శాతం సమకూర్చుకుంటే.. మిగతా 90 శాతం లోన్ పొందొచ్చు. మొత్తం రుణాల్లో మాత్రం 83 శాతం శిశు రుణాలే ఉండగా.. 15 శాతం కిశోర్ రుణాలున్నాయి. తరుణ్ రుణాలు 2 శాతం మాత్రమే.

లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముద్రా యోజన కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీని కోసం https://www.udyamimitra.in/ ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఇక ఇది అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ITR, GST ఐడెంటిఫికేషన్ నంబర్, పాన్ కార్డు అవసరం పడతాయి.

Rents: నెలకు 7 లక్షల జీతం.. అయినా భారత్‌లోని ఈ నగరంలో జీవించడం కష్టమా? బాధంతా రెంట్లతోనే?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.