యాప్నగరం

Bharat Bandh: రోజు బ్యాంకులు ప‌నిచేస్తాయ్

భారత్ బంద్ నేపథ్యంలో బ్యాంకులు తెరుస్తారా లేదా అని వెల్లడవుతున్న అనుమానాలపై అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పష్టత ఇచ్చింది.

Samayam Telugu 10 Sep 2018, 10:14 am
పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ జరుగుతోంది. బంద్‌ను ఎలాగైనా విజయవంతం చేయాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దీంతో బ్యాంకులు పనిచేయడంపై సందిగ్ధం నెలకొని ఉంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం కోసం ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. అయితే, భారత్ బంద్ నేపథ్యంలో బ్యాంకులు తెరుస్తారా లేదా అని వెల్లడవుతున్న అనుమానాలపై అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పష్టత ఇచ్చింది.
Samayam Telugu బంద్ అయినా.. బ్యాంకులు తెరిచే ఉంటాయ్


సోమవారం యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయని ఉద్యోగుల సంఘం తెలిపింది. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బ్యాంకు కార్యకలాపాలు సోమవారం మామూలుగానే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ పనిచేయకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఫలితంగా బంద్‌ను విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను కళ్లకు కట్టాలని చూస్తోంది. ప్రజల పక్షాన నిలిచే పార్టీలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది. అనుకున్నట్లే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు ముందుకొచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.