Bharat Bandh: Bank, Central Trade Unions To Observe Strike Tomorrow; Banking Services, Atms Will Be Impacted
Bank ఉద్యోగుల సమ్మె.. బ్యాంకులు, ఏటీఎంలు బంద్?
దేశవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగబోతోంది. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఆల్ ఇండియా స్ట్రైక్ చేస్తున్నాయి. జనవరి 8న (బుధవారం) సమ్మె ఉంటుంది. 14 డిమాండ్లు లక్ష్యంగా ట్రేడ్ యూనియన్లు సమ్మె బాట పడుతున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది వర్కర్లు పాల్గొనబోతున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో ఇదొక మెగా స్ట్రైక్గా నిలువనుంది.
Samayam Telugu8 Jan 2020, 6:21 am
దేశవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగబోతోంది. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఆల్ ఇండియా స్ట్రైక్ చేస్తున్నాయి. జనవరి 8న (బుధవారం) సమ్మె ఉంటుంది. 14 డిమాండ్లు లక్ష్యంగా ట్రేడ్ యూనియన్లు సమ్మె బాట పడుతున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది వర్కర్లు పాల్గొనబోతున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో ఇదొక మెగా స్ట్రైక్గా నిలువనుంది.
రాజకీయ పార్టీల మద్దతు
ట్రేడ్ యూనియన్లకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. తమిళనాడులోని ఎండీఎంకే, డీఎంకే పార్టీలు జనవరి 8న జరగబోయే దేశ వ్యాప్త సమ్మెకు సపోర్ట్ చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి కాలారాస్తోందని డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఆరోపించారు. శివ సేన పార్టీ కూడా దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించింది.
రేపు జరగబోయే సమ్మెలో చాలా యూనియన్లు పాల్గొంటున్నాయి. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ (సీఐటీయూ), ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయూటీయూసీ), హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్), సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ (ఎస్ఈడబ్ల్యూఏ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ), లేబర్ ప్రొగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్పీఎఫ్), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటీయూసీ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ), ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) వంటి యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.
ట్రేడ్ యూనియన్లతో పాటు బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. ఐదు బ్యాంక్ యూనియన్లు ఈ భారత్ బంద్లో పాలుపంచుకోనున్నాయి. దీంతో బ్యాంకింగ్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడనుంది. పలు చోట్ల కొన్ని బ్యాంక్ బ్రాంచులు పనిచేయకపోవచ్చు. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్సన్లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. ఎల్ఐసీ, బ్యాంకులు, ఆర్బీఐ, కో ఆపరేటివ్ బ్యాంక్స్, రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంటకచలం తెలిపారు.
ట్రేడ్ యూనియన్లు 14 డిమాంట్లను ముందుంచింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త కార్మిక సంస్కరణలను వెంటనే నిలిపివేయాలి. ఇదే కీలక డిమాండ్. కనీస వేతనాన్ని రూ.24,00కు పెంచడం కూడా మరో ప్రధాన డిమాండ్. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం ఆపేయడం, జాతీయ జనాభా లెక్కింపు నిలిపివేయడం, సిటిజన్షిప్ సవరణ చట్టాన్ని రద్దు చేయడం, ఎన్ఆర్సీ వెనక్కి తీసుకోవడం, బ్యాంకుల విలీనం వంటి కీలక డిమాండ్లు కూడా ఉన్నాయి.
బ్యాంక్ యూనియన్లు జనవరి 8న సమ్మె చేస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. అలాగే ఏటీఎం సర్వీసులపై పాక్షికంగా ప్రభావం పడనుంది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దీనికి అనుగుణంగా బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకోవడం మంచిది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.