యాప్నగరం

Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వారందరికీ 'అన్‌లిమిటెడ్' డేటా.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు టెలికాం దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. 5 సాంకేతికత విస్తరణ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 5జీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లందరికీ అపరిమిత డేటా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అన్‌లిమిటెడ్ డేటా పొందేందుకు ఎలాంటి ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి, ఏ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 17 Mar 2023, 4:54 pm

ప్రధానాంశాలు:

  • ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
  • 5జీ యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్
  • పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Airtel 5g
ఎయిర్‌టెల్ 5జీ
Airtel: ప్రముఖ టెలికా దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు అదిపోయే గుడ్‌న్యూస్ అందించింది. ప్రస్తుతం 5జీ వాడుతున్న కస్టమర్లకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డేటాపై విధిస్తున్న పరిమితిని ఎత్తివేసింది. అంటే రోజులో ఎంతైనా డేటాను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం 4జీ యూజర్లకు అందిస్తున్ ప్లాన్లపై రోజువారీ డేటా పరిమితి ఉంది. అయితే, అది ఇక 5జీ కస్టమర్లకు (Airtel 5G) వర్తించదు. ఇప్పటికీ రియలన్స్ జియో సైతం తమ 5జీ కస్టమర్లకు వెల్‌కమ్‌ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ (Unlimited 5G Data Offer) ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో జియో నుంచి వస్తున్న పోటీను తట్టుకుని నిలబడేందుకు ఎయిర్‌టెల్ సైతం అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. 5 జీ యూజర్లకు అందిస్తున్న అపరిమిత డేటా ప్లాన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
5జీ మొబైల్ ఫోన్ కలిగి ఉండి 5జీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న కస్టమర్లందరికీ ఈ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే, కనీసం రూ.239 అంత కంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌తో పాటు పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు సైతం ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని తెలిపింది. తమ యూజర్లు రోజువారీ డేటా పరిమితి గురించి ఆందోళన చెందకుండా ఇంటర్నెట్ సేవలన్ని వినియోగించుకోవడం, ఆన్‌లైన్ సేవల్ని పొందాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది ఎయిర్‌టెల్.

ప్రస్తుతం దేశంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో (Reliance Jio) కంపెనీలు పోటా పోటీగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. 5జీ సేవలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచే వెల్‌కమ్ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్ డేటా సదుపాయాన్ని అందిస్తోంది. మరోవైపు ఇటీవలే జియో ప్లస్ పేరిట కొత్త ప్లాన్లను లాంఛ్ చేసి పోస్ట్ పెయిడ్ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్ సైతం తమ 5జీ యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ వాడుతున్న వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఈ పరిమిత 5జీ డేటా ఆఫర్ పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలు దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా నగరాల్లోని 5జీ యూజర్లందరికీ ఈ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ వాడుకునే అవకాశం లభిస్తుంది.
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.