యాప్నగరం

Oxfam Report: 40 శాతం దేశ సంపద ఒక శాతం ధనవంతుల చేతుల్లోనే.. అదానీపై ఒకేసారి పన్ను విధిస్తే..?

Oxfam Report: భారత దేశంలో ధనవంతుల సంపదపై, ఆర్థిక అసమానతలపై ప్రముఖ రైట్స్ గ్రూప్ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు తొలి రోజును దీనిని విడుదల చేసింది. దీని ప్రకారం.. భారత దేశం మొత్తం సంపదలో 40 శాతం.. కేవలం ఒక శాతం ధనవంతుల దగ్గరే ఉందని స్పష్టం చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే..

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 16 Jan 2023, 3:56 pm
Oxfam Report: భారత్‌లో ధనవంతులు మరింత ధనికులుగా మారుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారుకుంటున్నారు. ఎప్పుడూ ఇదే జరుగుతుంటుంది. తాజాగా మరోసారి ఇది తేటతెల్లమైంది. ఈ మేరకు భారత దేశంలో ఆర్థిక అసమానతలపై ప్రముఖ రైట్స్ గ్రూప్ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్‌లోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద ఏకంగా రూ.54.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంకా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం.. భారత్‌లోని ఒక శాతం ధనవంతుల దగ్గరే ఉందంట. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వార్షిక సమావేశం తొలి రోజును ఈ నివేదికను వెలువరించింది ఆక్స్‌ఫామ్. ఇక అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని తెలిపింది.
Samayam Telugu oxfam report billionaires

సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ (Survival of the Richest) పేరుతో భారతదేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ ఈ రిపోర్ట్‌ను బహిర్గతం చేసింది. ఇంకా ఆ ఆక్స్‌ఫామ్ నివేదికలో చాలా విషయాలే వెల్లడయ్యాయి. ప్రపంచ కుబేరుడు, భారత అత్యంత కుబేరుడు గౌతమ్ అదానీ సంపదపై పన్ను విధిస్తే ఏం జరుగుతుంది.. ఒకేసారి బిలియనీర్లపై పన్ను విధిస్తే ఏం జరుగుతుంది వంటి విషయాలను వెల్లడించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

Twitter India: ఆఫీసుల్ని మూసేస్తున్న ట్విట్టర్.. అసలేం జరుగుతోంది.. అదే నిజమా?

దేశంలోని బిలియనీర్లలో మొదటి 100 మందిపై 2.5 శాతం చొప్పున పన్ను విధించడం లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించినా.. బడి మానేసి పిల్లలందరినీ తిరిగి స్కూళ్లలో చేర్చేందుకు అవసరమైన డబ్బు వస్తుందని ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో వెల్లడైంది.

రోజుకు రూ.58 పొదుపు చేస్తే.. ఇలా 8 లక్షలు చేతికి.. ఈ ప్రభుత్వ స్కీమ్ అదిరిపోయిందిగా!

ఇంకా దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మొత్తం సంపదపై ఒకేసారి పన్ను విధిస్తే.. రూ.1.79 లక్షల కోట్ల నిధులు సమకూరుతాయట. ఇది భారత్‌లోని ప్రైమరీ స్కూల్స్‌లో 50 లక్షల మంది ఉపాధ్యాయుల ఏడాది వేతనాలకు సమానమట. అంటే సంవత్సరం పాటు ఈ డబ్బుతో వారికి జీతం ఇవ్వొంచంట.

ఇదే విధంగా భారత బిలియనీర్లపై ఒకేసారి 2 శాతం పన్ను విధిస్తే గనుక రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుందట. ఈ డబ్బతో భారత్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ రానున్న మూడేళ్ల పాటు పోషకాహారం అందించొచ్చు.

క్రెడిట్ కార్డు బిల్లు టైమ్‌కు కట్టట్లేదా? RBI కొత్త రూల్‌తో ఊరట..

ఇక లింగ అసమానతల గురించి కూడా ఆక్స్‌ఫామ్ కీలక విషయాలను వెల్లడించింది. ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి.. మహిళా కార్మికులు ఇంకా 63 పైసలు మాత్రమే పొందుతున్నారట.

కరోనా సంక్షోభం సమయంలోనూ బిలియనీర్ల సంపద భారీగా పెరిగినట్లు.. అప్పటినుంచి 2022 నవంబర్ వరకు ఏకంగా బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగిందంట. ఈ లెక్కన రోజుకు రూ.3,608 కోట్ల సంపద యాడ్ అయిందంట.

ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. టీసీఎస్ కీలక నిర్ణయం.. ఇక తప్పదు!

దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా.. అది 2022 నాటికి 166కు పెరిగింది. భారత్‌లోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ.54.12 లక్షల కోట్లను తాకింది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే డబ్బుతో.. ఏకంగా 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చని ఆక్స్‌ఫామ్ వివరించింది.


Also Read: డెబిట్ కార్డ్ ఛార్జీలు పెంపు.. ఈ ప్రభుత్వ బ్యాంక్ కస్టమర్లకు మరో పెద్ద దెబ్బ!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.