యాప్నగరం

వాహనదారులకు భారీ షాక్.. ఇక హెల్మెట్ పెట్టుకున్నా జరిమానా కట్టాల్సిందే! కేంద్ర కొత్త రూల్స్?

మీకు బైక్ లేదా స్కూటర్ ఉందా? అయితే మీరు కచ్చితంగా హెల్మెట్ కలిగి ఉంటారు. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం హెల్మెట్‌కు సంబంధించిన రూల్స్‌ను సవరించబోతోంది.

Samayam Telugu 3 Aug 2020, 6:31 am
వాహనదారులకు ముఖ్యమైన అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. మోదీ సర్కార్ హెల్మెట్ రూల్స్‌ను కఠినతరం చేయబోతోంది. దీంతో మీరు ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్న కూడా జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చు.
Samayam Telugu helmet new rules


మీరు షాకయ్యారు కాదు.. అవును మీరు చదివింది నిజమే. అదేంటి హెల్మెట్ ఉంటే జరిమానా ఎందుకు విధిస్తారని ఆలోచిస్తున్నారా? ఇక్కడే కొత్త రూల్ అమలులోకి రాబోతోంది. రోడ్ సైడ్ లేదా ఎక్కడ కొనుగోలు చేసినా హెల్మెట్‌పై బీఐఎస్ మార్క్ ఉండాలి. హెల్మెట్‌పై ఈ మార్క్ లేకపోతే పెనాల్టీ పడుతుంది.

Also Read: undefined


కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత బీఎస్‌బీఐ మార్క్ లేని హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం జరిమానా కట్టాల్సిందే. కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్‌కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే వాహనదారులు ఉపయోగించాలి.

ఇకపోతే ఈ కొత్త రూల్ 2021 మార్చి 1 నుంచి అమలులోకి వస్తుంది. హెల్మెట్ కొనే వారు మాత్రమే కాకుండా బీఐఎస్ మార్క్ లేనటువంటి హెల్మెట్లను తయారు చేసే వారికి కూడా జరిమానా పడుతుంది. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.