యాప్నగరం

2050 నాటికి 70% ఎక్కువ ఆహారం కావాలి

జనాభా శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు తగిన స్థాయిలో ఆహార ఉత్పత్తులను పండించడం మొత్తం ప్రపంచానికి సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని వలాగ్రో గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) ప్రేమ్‌ వారియర్‌ అన్నారు.

Samayam Telugu 27 May 2018, 11:21 am
ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు తగిన స్థాయిలో ఆహార ఉత్పత్తులను పండించడం సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని వలాగ్రో గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) ప్రేమ్‌ వారియర్‌ అన్నారు. 2050 నాటికి ఇప్ప‌టికి ఉన్న డిమాండ్ ఆధారంగా లెక్కిస్తే 70% ఎక్కువ ఆహారం, 50 శాతం ఎక్కువ నీరు. 30-40% ఎక్కువ ఇంధ‌నాలు కావాల్సి ఉంటుంద‌న్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో వ‌లాగ్రో సీవోవో ప్రేమ్ వారియ‌ర్ పాల్గొని మాట్లాడారు.

వలాగ్రో గ్రూప్‌ సీవోవో ప్రేమ్‌ వారియర్‌

" />
Samayam Telugu food inflation
ఎక్కువ ఆహారం కావాలి


ఉత్పాదకతలో తగ్గుదల, భూముల విస్తీర్ణం తగ్గడం, వాతావరణ మార్పులు, వ్యవసాయం చేస్తున్న వారి సంఖ్య తగ్గడం వంటి అంశాలు రానున్న కాలంలో ఆహార భద్రతను ప్రభావితం చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటి వనరులను వినియోగించుకుని అధికంగా ఉత్పాదకత ఉండే వంగడాల అవసరం ఉందని, అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల వృధాను తగ్గించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ ‘భవిష్యత్‌ సాగు’పై నిర్వహించిన ఒక సమావేశంలో ప్రేమ్‌ వారియర్‌ మాట్లాడారు. వినూత్న విధానాలను అనుసరించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చని బిఎఎస్‌ఎఫ్‌ ఇండియా చైర్మన్‌ రామన్‌ రామచంద్రన్‌ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు తగిన స్థాయిలో సదుపాయాలు లేకపోవడం వల్ల గత ఏడాదిలో 98 వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు వృథాగా మారినట్టు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నష్టాలను తగ్గించేందుకు వినూత్న విధానాలను అనుసరించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.