యాప్నగరం

రేపటిలోగా కరెన్సీ కష్టాలు తీరిపోతాయట!

కరెన్సీ కష్టాలు ప్రజలను దేశవ్యాప్తంగా జనాల్ని వెంటాడుతున్నాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ కొరత తాత్కాలికమని చెబుతున్నా... సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.

TNN 19 Apr 2018, 4:42 pm
కరెన్సీ కష్టాలు ప్రజలను దేశవ్యాప్తంగా జనాల్ని వెంటాడుతున్నాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ కొరత తాత్కాలికమని చెబుతున్నా... సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అయితే నగదు కొరతకు సంబంధించిన సమస్య శుక్రవారం లోగా పరిష్కారమవుతుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. నగదు కొరత అధికంగా ప్రాంతాలకు కరెన్సీ సరఫరా జరుగుతోందని, ఇది శుక్రవారంలోగా అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అంతేకాదు కరెన్సీ కొరత అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదని అన్నారు. తెలంగాణ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో సమస్య ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం నగదు రవాణా అవుతోందని, ఈరోజు సాయంత్రానికి ఆయా రాష్ట్రాలకు చేరుకుంటుందని ఆయన విలేకరులకు వెల్లడించారు. గతంలో కంటే రూ.70,000 కోట్ల మేర ఎస్బిఐ నగదు బదలాయింపులు తగ్గాయి. ఇది ఏటీఎంలలో నగదు విత్‌డ్రాల్లో మూడో వంతు.
Samayam Telugu నగదు కొరత


ఏటీఎంల ద్వారా 2018 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సుమారు 15,291 బిలియన్ల కరెన్సీ ఉపసంహరింంచారని, ఇది గత ఆరు మాసాలతో పోల్చితే 12.2 శాతం అధికంమని అన్నారు. ఏప్రిల్ నెలలో తొలి 13 రోజుల్లో నగదు డిమాండ్‌ రూ.45 వేల కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. నగదు విత్‌డ్రా చేస్తే తిరిగి మళ్లీ ఆ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతుంటేనే నగదు రొటేషన్‌ సజావుగా ఉంటుందని రజనీష్‌ వ్యాఖ్యానించారు. అలా కాకుండా ఉపసంహరించిన నగదును డిపాజిట్ చేయకుండా తమ వద్దే అట్టిపెట్టుకుంటే బ్యాంకులు ఎంత సరఫరా చేసినా సరిపోదని పేర్కొన్నారు. నగదు లావాదేవీలు జరగడం చాలా ముఖ్యమని అన్నారు. కరెన్సీ కొరత తీర్చేందుకు అధిక నగదు నిల్వలు ఉన్న రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా తరలిస్తున్నారు.

మరోవైపు కర్ణాటక, ఏపీలో నగదు ఉపసంహరణలు పెరగడంతో ఆదాయపన్ను అధికారులు నిఘా పెంచారు. కర్ణాటక, ఏపీలో 30 నుంచి 35 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో అకస్మాత్తుగా నగదు వినియోగం పెరిగిందని, దీంతో కరెన్సీ కొరత ఏర్పడిందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. ఈ సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.