యాప్నగరం

Voter Id: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్- ఓటర్ ఐడీ లింక్ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

Aadhaar Voter Id Link: ఓటర్ ఐడీ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఉగాది పండగ వేళ తీపి కబురు అందించింది. ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసే గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో చాలా మందికి ఊరట కలుగుతుందని అధికారులు తెలిపారు. ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు లింక్ ఇంకా చేయని వారికి మరో ఏడాది పాటు సమయం లభించినట్లయింది. కొత్త డేడ్ లైన్, లింక్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 22 Mar 2023, 1:01 pm

ప్రధానాంశాలు:

  • ఉగాది వేళ కేంద్ర గుడ్‌న్యూస్
  • ఆధార్-ఓటర్ ఐడీ లింక్ గడువు పెంపు
  • మార్చి 31, 2024 వరకు గడువు పొడిగింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Aadhaar to voter ID
ఆధార్ ఓటర్ ఐడీ లింక్
Aadhaar Voter Id Link: ఉగాది పండగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసే గడువును మరోసారి పెంచింది. ఇప్పటి వరకు ఏప్రిల్ 1, 2023 లోపు ఓటర్ కార్డు- ఆధార్ లింక్ చేయాల్సి ఉండగా ఆ గడువును మార్చి 31, 2024 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది 2022, జూన్ 17న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1తో గడువు ముగియనుండగా మరోసారి పెంచడం దేశంలోని చాలా మంది పౌరులకు ఊరట కలిగిస్తుందని అధికారులు తెలిపారు.
నాయ్య శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్-6బీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 2022 నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ కార్డు నంబర్లను సేకరిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 12 వరకు 54.32 కోట్ల ఆధార్ కార్డు నంబర్లను సేకరించినట్లు ఎన్నికల కమిషన్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వాటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఓటర్ కార్డు కలిగిన వారు ఆన్‌లైన్‌లోనే ఈ ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు.. ఎస్ఎంఎస్ ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అయితే, ఇది తప్పనిసరి కాదు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఆధార్ కార్డుతో ఓటర్‌ కార్డును అనుసంధానం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెలుసుబాటు కల్పించింది.

ఎన్నికల కమిషన్ ప్రకారం.. ఓటర్ కార్డును ఆధార్ సంఖ్యతో అనుసంధానం (voter id aadhaar link online) చేసుకోవడం ద్వారా చాలా బోగస్ ఓట్లను గుర్తించేందుకు వీలుంటుంది. ఒక వ్యక్తికి ఒకటికన్నా ఎక్కువ ఓటర్ కార్డులు ఉంటే అవి రద్దవుతాయి. 2021 డిసెంబర్‌లో ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది పార్లమెంట్. దీంతో ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ఓటర్ కార్డు అనుసంధానం చేసుకోవాలనుకుంటున్నవారు ముందుగా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ NVSP.inలోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దాని తర్వాత వ్యక్తిగత వివరాలు సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. దీంతో మీ ఓటర్ కార్డుతో మీ ఆధార్ నంబర్ అనుసంధానం అవుతుంది. అలాగే ఎలక్టర్స్ ఆధార్ డేటా కోసం కొత్తగా ఫామ్ 6బీ తీసుకువస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.